షారూఖ్తో తలపడేది మరో యాక్షన్ హీరోనా?
ఎట్టకేలకు ఓ సినిమాని ప్రకటించాలని షారూఖ్ భావిస్తున్నారు. తాను చేయబోయే దర్శకుల జాబితా చాలానే వినిపిస్తుంది. అందులో రాజ్కుమార్ హిరానీ పేరు ప్రముఖంగా హల్చల్ చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ దాదాపు రెండేళ్ళుగా కొత్త సినిమాని ప్రకటించడం లేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకొన్ని రోజుల వరకు ఆయన్నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే ఇక షారూఖ్ని మర్చిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఓ సినిమాని ప్రకటించాలని షారూఖ్ భావిస్తున్నారు. తాను చేయబోయే దర్శకుల జాబితా చాలానే వినిపిస్తుంది. అందులో రాజ్కుమార్ హిరానీ పేరు ప్రముఖంగా హల్చల్ చేస్తుంది. కానీ దీనిపై షారూఖ్ నుంచిగానీ, రాజ్ కుమార్ హిరానీ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాకి ఈ బాద్షా సైన్ చేసినట్టు సమాచారం. తన నెక్ట్స్ సినిమా ఇదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది హై ఓల్టేజ్ యాక్షన్గా తెరకెక్కనుందని, ఇందులో మరో యాక్షన్ హీరో జాన్ అబ్రహాం విలన్గా కనిపించబోతున్న తెలుస్తుంది. షారూఖ్, జాన్ అబ్రహం మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు వెండితెరని షేక్ చేస్తాయని, సినిమాకి `పఠాన్` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో అదిరిపోయే మరో న్యూస్ హల్ చేస్తుంది. ఇందులో షారూఖ్కి జోడీగా దీపికా పదుకొనె నటించబోతున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి.
షారూఖ్ చివరగా `జీరో` చిత్రంలో నటించారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పరాజయం చెందింది. మరోవైపు జాన్ అబ్రహాం హిందీలో `ఎటాక్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది దేశభక్తి ప్రధానంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ కావడం విశేషం.