సావిత్రికి జీవం పోసింది 'మహానటి'!
అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి'
అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు రాజకీయనాయకులు కూడా ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఈ సినిమాను చూసి కన్నీరు ఆపుకోలేకపోయానని అన్నారు.
''సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ సినిమాను తెరకెక్కించారు. అసామాన్య కళాకారిణి. ఈ సినిమా ఆ గొప్ప నటికి మళ్ళీ జీవం పోసింది. సినిమాను చూసి కన్నీరు ఆపుకోవడం చాలా కష్టం. ప్రధాన పాత్రలు పోషించిన కీర్తి సురేష్, సమంత వంటి వారు అద్భుత నటన కనబరిచారు. ఈ సినిమా నన్ను కదిలించింది. చాలా కాలం వరకు నా హృదయంలో నిలిచిపోతుంది'' అని తెలిపారు.