నేడు `మదర్స్ డే` సందర్భంగా తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది జాన్వీ కపూర్. తల్లి తనతో లేకపోయినా, ప్రపంచంలో బెస్ట్ మదర్ తనే అంటూ కొనియాడింది.
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) బాలీవుడ్తోపాటు సౌత్ సినిమాని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. హీరోయిన్కి స్టార్ ఇమేజ్ని, లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ని తీసుకొచ్చిన ఘనత ఆమెకే దక్కుతుంది. హీరోలకు దీటుగా పారితోషికం అందుకున్న ఘనత కూడా ఆమెకే చెల్లుతుంది. గ్లామర్ పాత్రలు, ట్రెడిషనల్ రోల్స్ ఇలా అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించిన ఘనత శ్రీదేవి సొంతం. అతిలోక సుందరిగా ఇండియన్ ఆడియెన్స్ లో తనదైన ముద్ర వేసుకున్న శ్రీదేవి హీరోయిన్గానే కాదు, ఇంట్లో బెస్ట్ తల్లిగానూ ఉన్నారు. ఓ వైపు సినీ కెరీర్ని, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ రాణించారు.
నాలుగేండ్ల క్రితం శ్రీదేశి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దుబాయ్లో ఓ ఫంక్షన్కి వెళ్లి హోటల్లో అనుమానాస్పద స్థితిలో ఆమె కన్నుమూసి కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు. ఆయితే ఆమె కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తుంది. తల్లి చనిపోయాక ఆమె నటించిన తొలి చిత్రం `దఢఖ్` విడుదలైంది. దీంతో కూతురుని తెరపై చూసుకునే భాగ్యానికి నోచుకోలేకపోయింది శ్రీదేవి. ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు గ్లామర్ ఫోటో షూట్తోనూ ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉంటూ అలరిస్తుంది. ఫాలోయింగ్ని పెంచుకుంటుంది.
ఇదిలా ఉంటే నేడు `మదర్స్ డే` (Mothers day) సందర్భంగా తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది జాన్వీ కపూర్. తల్లి తనతో లేకపోయినా, ప్రపంచంలో బెస్ట్ మదర్ తనే అంటూ కొనియాడింది. ఓ ఎమోషనల్ పోస్ట్ ని పంచుకుంది. ఇందులో ఆమె చెబుతూ, `నువ్వు మాతో లేకపోయినా నీ ప్రేమని నేను రోజూ పొందుతున్నాను. మీరు మా మధ్య లేకపోయినా ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి మీరే. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను` అంటూ శ్రీదేవిని ఉద్దేశించి ఎమోషన్ పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్. ఈ సందర్భంగా చిన్నప్పుడు తనని ఎత్తుకుని శ్రీదేవి దిగిన ఫోటోని పంచుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఇది వైరల్ అవుతుంది.
ఇక సినిమాల కెరీర్ పరంగా జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఆమె `గుడ్ లక్ జెర్రీ`, `మిలి`, `బవాల్` చిత్రాల్లో నటిస్తుంది. `బవాల్`లో ఆమె వరుణ్ ధావన్తో కలిసి నటిస్తుంది. జాన్వీ నటిస్తున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఆమె హీరోయిన్గా నెక్ట్స్ లెవల్కి చేరుకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు సైత్లోకి కూడా ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుందని సమాచారం.
