సావిత్రిని జెమిని గణేశన్ ట్రాప్ చేశాడు : జమున
సావిత్రిని జెమిని గణేశన్ ట్రాప్ చేశాడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జమున సావిత్రి గురించి మాట్లాడుతూ " వివాహం విషయంలో సావిత్రి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసి నాగేశ్వరరావు ఆమెను వారించారట .. అయినా ఆమె వినిపించుకోలేదు. సావిత్రికి ఆ సమయంలో అవసరమయ్యే తండ్రి గైడన్స్ లేదు. తనకి తోచిన నిర్ణయాలు తీసుకునే స్థితికి వచ్చేసింది. అదే సమయంలో జెమినీతో కలిసి తమిళ సినిమాల్లో చేసింది.. ఆమె దగ్గర బాగా డబ్బుంది. అందువలన జెమినీ గణేశన్ ఆమెను ట్రాప్ చేశాడేమోనని అనిపిస్తోంది. నాకు సావిత్రితోనే తప్ప ఆయనతో పెద్దగా పరిచయం కూడా ఉండేది కాదు" అంటూ చెప్పుకొచ్చారు.