`జై బాలయ్య` వచ్చాడు.. అభిమానులకు సంబరాలు తెచ్చాడు.. `వీరసింహారెడ్డి` ఫస్ట్ సాంగ్..
`వీరసింహారెడ్డి` చిత్రంలోని మొదటి సాంగ్ని విడుదల చేశారు. మాస్ ఆంథెమ్ పేరుతో `జై బాలయ్య` అంటూ సాంగ్ని శుక్రవారం రిలీజ్ చేశారు. ఓ పండుగ వాతావరణంలో వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నయా మూవీ `వీరసింహారెడ్డి`. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి సాంగ్ని విడుదల చేశారు. మాస్ ఆంథెమ్ పేరుతో `జై బాలయ్య` అంటూ సాంగ్ని శుక్రవారం రిలీజ్ చేశారు. ఓ పండుగ వాతావరణంలో వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సంక్రాంతికి పండుక్కి అసలైన సెలబ్రేషన్ని తీసుకురాబోతుందనేలా ఉండటం విశేషం.
తమన్ సంగీతం అందించిన ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా, కార్జ్ ముల్లా ఆలపించారు. శేఖర్ మాస్టర్, శంకర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే సంగీత దర్శకుడు తమన్ పాటలు చాలా వరకు కాపీ కొడతారని, తన పాత పాటలనే తిప్పి తిప్పి కొడతారనే విమర్శలున్న విషయం తెలిసిందే. అయితే `జై బాలయ్య` సాంగ్ విషయంలోనూ కాపీ అనే విమర్శలు వస్తున్నాయి. విడుదలకు ముందు నుంచే ఈ విమర్శలు రావడం గమనార్హం. ఈ సాంగ్ నిన్ననే లీక్ అయ్యింది. దీన్ని విజయశాంతి నటించిన `ఒసేయ్ రాములమ్మ` చిత్రంలో టైటిల్ సాంగ్కి దగ్గరగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి.
మరి ఈ కాపీ మ్యాటర్ పక్కన పెడితే బాలయ్య ఫ్యాన్స్ ని మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వారిలో ఊపు తీసుకొస్తుంది. సంక్రాంతి పండగ ఇప్పుడే వచ్చిందా? అనే ఫీలింగ్ తీసుకొస్తుందని అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న `వీరసింహారెడ్డి` చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇందులో బాలయ్యకి జోడీగా శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.