ముంబయి ఎయిర్పోర్ట్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్కి షాక్.. విదేశాలకు వెళ్లకుండా పోలీసుల అడ్డగింత..
రెండు మూడు సార్లు మాత్రమే ఈడీ ముందు హాజరైన జాక్వెలిన్కి ఈడీ ఎల్ఓసీ(లుక్ ఔట్ సర్క్యూలర్) జారీ చేసింది. దేశం విడిచివెళ్లకూడదనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జాక్వెలిన్కి షాక్ ఇచ్చారు పోలీసులు.
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రూ.200కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్తో జాక్వెలిన్కి సంబంధాలున్నట్టు చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆయనతో జాక్వెలిన్ ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఈ బాలీవుడ్ బ్యూటీపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు గానూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే పలు మార్లు జాక్వెలిన్కి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని తెలిపింది.
అనేక మార్లు డుమ్మా కొట్టిన ఈ బ్యూటీ.. కేవలం రెండు మూడు సార్లు మాత్రమే ఈడీ ముందు హాజరైన జాక్వెలిన్కి ఈడీ ఎల్ఓసీ(లుక్ ఔట్ సర్క్యూలర్) జారీ చేసింది. దేశం విడిచివెళ్లకూడదనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జాక్వెలిన్కి షాక్ ఇచ్చారు పోలీసులు. ముంబయి ఎయిర్పోర్ట్ లో ఆమెని అడ్డుకున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ముంబయి ఎయిర్ పోర్ట్ లో జాక్వెలిన్ని అడ్డుకున్నారు. ఓ షో కోసం జాక్వెలిన్ దుబాయ్కి వెళ్లాల్సి ఉంది. అందులో భాగంగా ఆమె ఆదివారం ముంబయి ఎయిర్పోర్ట్ కి చేరుకోగా, అక్కడ పోలీసులు ఆమెని అడ్డుకున్నారు. అయితే ఆమెని అరెస్ట్ చేశారా? లేదా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
రెండువందల కోట్లకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్పై ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడైనా సుఖేష్ చంద్రశేఖర్తో జాక్వెలిన్, నోరా ఫతేహి లాంటి సెలబ్రిటీలు రిలేషన్ కొనసాగించినట్టు తెలుస్తుంది. గతంలో ఈడీ విచారించినప్పుడు సుఖేష్ తన నుంచి కోట్లల్లో విలువ చేసే గిఫ్ట్స్ పొందిన సెలబ్రిటీల పేర్లు ప్రస్తావించాడు. అందులో భాగంగా జాక్వెలిన్పై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, సుఖేష్తోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ ముందు చెప్పడం గమనార్హం. అయితే ఈ సమయంలోనే సుఖేష్తో క్లోజ్గా ఉన్న జాక్వెలిన్ ఫోటో లీక్ కావడంతో ఈ హీరోయిన్పై మరింత దృష్టిపెట్టింది ఈడీ.
ఇక జాక్వెలిన్ కెరీర్ పరంగా చూస్తే.. `బచ్చన్ పాండే`, `ఎటాక్`, `విక్రాంత్ రోణా`, `సర్కస్`, `రామ్సేతు` చిత్రాల్లో నటిస్తుంది. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ `హరి హర వీరమల్లు` చిత్రంలో నర్గీస్ ఫక్రీ ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.