మహేష్-త్రివిక్రమ్ మూవీలో నందమూరి హీరో విలన్ గా చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.   


సక్సెస్ ఫార్ములా ఎవరూ వదులుకోరు. దర్శకుడు త్రివిక్రమ్(Trivikram)కూడా అదే చేస్తున్నారు. అల వైకుంఠపురంలో ఓ కీలక రోల్ కోసం అక్కినేని హీరో సుశాంత్ ని తీసుకున్నారు. కోటీశ్వరుడైన మిల్కీ బాయ్ క్యారెక్టర్ లో సుశాంత్ బాగానే ఒదిగిపోయారు. నిజానికి ఫార్మ్ లో ఉన్న హీరోలు ఆ రోల్ చేయరు. ప్రేక్షకులు మరిచిపోతుండగా కనీసం ఓ పెద్ద సినిమా చేయడం మంచిదని భావించిన సుశాంత్ అల వైకుంఠపురంలో చిత్రం చేశారు. అల వైకుంఠపురంలో భారీ విజయం సాధించగా... మహేష్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. 

మహేష్ 28వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలతో లేటయ్యింది. అయితే త్వరలోనే మహేష్ ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక అల వైకుంఠపురంలో మాదిరి ఈ చిత్రంలో కూడా మరొక హీరో నటిస్తున్నారంటూ కొన్నాళ్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నితిన్, శర్వానంద్ వంటి హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. 

Scroll to load tweet…

మొత్తంగా నేడు దీనిపై క్లారిటీ వచ్చింది. నందమూరి హీరో తారకరత్న (Tarakaratna) మహేష్-త్రివిక్రమ్ మూవీలో నటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. #SSMB28 అనే ట్యాగ్ తో పాటు డెవిల్ ఎమోజీ, సిరంజి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ అస్పష్టంగా ఉన్నప్పటికీ మహేష్ కి విలన్ గా చేస్తున్నాడని నెటిజెన్స్ ఫిక్స్ అయ్యారు. మహేష్ మూవీలో నందమూరి హీరో విలన్ గా చేయడం ఊహించని పరిణామం. ప్రస్తుతం తారకరత్న ట్వీట్ వైరల్ గా మారింది. 

2002లో విడుదలైన ఒకటో నంబర్ కుర్రాడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక రత్న అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. మొదట్లో మెరుపు మెరిపించినా వరుస పరాజయాలతో ఫేమ్ కోల్పోయాడు. అమరావతి మూవీలో ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. అలాగే కొన్ని చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాడు. ఇక మహేష్ (Mahesh Babu) మూవీలో తారకరత్న పాత్రపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు.