మెగాడాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడిపోతున్నారా? పెళ్లి ఫోటోలు ఎందుకు డిలీట్ చేసినట్టు?
మెగాడాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డకి మూడేళ్ల క్రితం గ్రాండ్గా మ్యారేజ్ జరిగింది. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య మనస్పార్థాలు వచ్చాయనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక.. మూడేళ్ల క్రితం చైతన్యజొన్నలగడ్డని వివాహం చేసుకుంది. రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్యాలెస్లో చాలా గ్రాండ్గా వీరి వివాహం జరిగింది. ఇదిలా ఉంటే మ్యారేజ్ జరిగి మూడో ఏడాది నడుస్తుంది. తాజాగా ఈ ఇద్దరికి సంబంధించిన ఓ షాకింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య మనస్పార్థాలు వచ్చాయని, దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.
దీనికితోడు సోషల్ మీడియా మాధ్యమమైన ఇన్స్టాగ్రామ్లో ఈ ఇద్దరు ఒకనొకరు అన్ ఫాలో అయ్యారు. అంతేకాదు చైతన్య జొన్నలగడ్డ ఏకంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన పెళ్లిఫోటోలను డిలీట్ చేశారు. నిహారికతో ఉన్న ఏ ఒక్క ఫోటో కూడా ఇన్స్టాగ్రామ్లో లేకుండా డిలీట్ చేశారు. దీంతో ఇప్పుడు సరికొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరి మధ్య వివాదం నెలకొందని, గ్యాప్ పెరిగిందనే పుకార్లు ఊపందుకున్నాయి. నిహారిక, చైతన్య మధ్య వైవాహిక జీవితం సాఫీగా సాగడం లేదని తెలుస్తుంది. ఇద్దరికి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఇప్పుడు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారని అంటున్నారు నెటిజన్లు.
అయితే ఏ సెలబ్రిటీ పెయిర్ అయినా, వారిద్దరి విడిపోవడానికి ముందు చేసే పని సోషల్ మీడియాలో అన్ ఫాలో కావడం, వారి ఫోటోలను డిలీట్ చేయడం. ఇప్పుడు నిహారిక, చైతన్యల విషయంలో అదేజరిగింది. అయితే ఇది కేవలం చైతన్య మాత్రమే పెళ్లి ఫోటోలను, నిహారికతో ఉన్న ఫోటోలను డిలీట్ చేశారు. కానీ నిహారిక మాత్రం తన ఫోటోలను అలానే ఉంచింది. చైతన్యతో దిగిన ఫోటోలు, పెళ్లి ఫోటోలు ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నాయి. దీంతో ఈ వార్తలో నిజమెంతా అనేది సస్పెన్స్ గా మారింది. దీనిపై వాళ్లు స్పందిస్తారా? అనేది చూడాలి.
గుంటూరుకి చెందిన ఐజీ జే ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ. మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలున్నాయి. నిహారిక,చైతన్య కూడా ముందే బాగా తెలుసు. ఇలా రెండు ఫ్యామిలీలు మాట్లాడుకునిఈ సంబంధాన్ని సెట్ చేసుకున్నారు. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ అంతా పాల్గొంది. ప్రత్యేక(సొంత) జెట్స్(ఫ్లైట్స్ )లో వారు రాజస్థాన్కి వెళ్లడం విశేషం. ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక నిహారిక యాంకర్గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది.పలు షోస్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్గా టర్న్ తీసుకుంది. `ఒక మనసు`, `సూర్యకాంతం` వంటి మూడు సినిమాలు చేసింది. కానీ విజయం సాధించలేకపోయింది. `సైరా`లోనూ కాసేపు మెరిసింది. సినిమాల్లో సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ ప్రారంభించి, ఓటీటీ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు నిర్మిస్తుంది.