Vidyut Jammwal: ఒంటిపై నూలు పోగు లేకుండా అడవుల్లో తిరుగుతున్న హీరో, కారణం ఏంటీ..?
ప్రముఖ బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ అందరికి షాక్ ఇచ్చాడు. ఒంటి బట్టలు లేకుండా.. కనీసం నూలు పోగు కూడా లేకుండా హిమాలయాల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ హీరో ఇక్కడ చేస్తున్నట్లు?
![Indian Actor Vidyut Jammwal Shared His Newde Photos On Social Media JMS Indian Actor Vidyut Jammwal Shared His Newde Photos On Social Media JMS](https://static-ai.asianetnews.com/images/01hh9bdhd46e894v12kxps9kfk/new-updated-thumbnail-2023_363x203xt.jpg)
బాలీవుడ్ లో హీరోగా.. సౌత్ లో విలన్ గా నటిస్తూ.. విద్యుత్ జమ్వాల్ గురించి అందిరకి తెలిసిందే. ఫిట్ నెస్, హ్యాండ్సమ్ నెస్ లో స్టార్ హీరోలకు కూడా పోటీ ఇవ్వగల నటుడు. కాని హీరోగా పెద్దగా క్లిక్ అవ్వలేదు కాని.. విలన్ గా మాత్రం సౌత్ లో చాలా సినిమాలు చేశాడు. ఫిట్ నెస్ కు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే విద్యుత్.. టోన్డ్ బాడీతో శిల్పంలా కనిపిస్తాడు. ఇక అమ్మాయిల ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఈక్రమంలో ఈ నటుడు సడెన్ గా అందరికి షాక్ ఇచ్చాడు.
విద్యుత్ జామ్వాల్ ప్రకృతీ ప్రేమికుడు. ఆయన ఎక్కవగా కొండలు కోనలు తిరుగుతుంటారు. నచ్చిన చోటకు వెళ్లడం.. సేదతీరడం చాలా ఇష్టం. ఇక తాజాగా హిమాలయాల పర్యటనలో ఉన్నాడు స్టార్ నటుడు. అక్కడ చిక్కటి చలికాలం.. గడ్డ కట్టించే చలిలో కూడా.. ఒంటిపే బట్టలు లేకుండా సేదదీరుతున్నాడు. నూలు పోగుకూడా లేకుండా పెయిర్ బాడీతో హిమాలయా అడవుల్లో తిరుగుతున్నాడు. అక్కడే వండుకునితింటూ.. సరదాగా గడుపుతున్నాడు. ఈ ఫోటోలు విద్యుత్ తన సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేశాడు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అంతా షాక్ అవుతున్నారు కూడా.
తాను దైవ నివాసంలో తను ఉన్నానని.. ప్రతి సంవత్సరం 7-10 రోజులు హిమాలయాల్లో గడపడం తన జీవితంలో భాగమైందని’ విద్యుత్ జమ్వాల్ తన పోస్టులో చెప్పారు. ‘విలాసవంతమైన జీవితం నుండి అరణ్యానికి వచ్చినపుడు ఒంటరితనంలో తన గురించి తాను తెలుసుకునే అవకాశం దొరికిందని.. ప్రకృతి నిశ్శబ్దంలో తనను తాను తెలుసుకుంటానని’ రాసుకొచ్చారు. ‘కొద్దిరోజుల తర్వాత కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇంటికి తిరిగి వస్తానని.. ఏకాంతం అనేది అనూహ్యమైనదని.. అనుభవ పూర్వకంగా మాత్రమే తెలుస్తుందని.. ఆయన అన్నారు.
ఇక విద్యుత్ జమ్వాల్ హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో శక్తి, బిల్లా 2, ఊసరవెల్లి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. మార్షల్ ఆర్ట్స్లో కూడా ఇన్ స్ట్రక్టర్. ఇక విద్యుత్ జమ్వాల్ , ఆదిత్య దత్ కలిసి క్రాక్ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 23, 2024 న విడుదల కాబోతోంది.