'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ట్రైలర్!
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్'.
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్'. రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగ్రవాది చెప్పే డైలాగ్ తో సినిమా ట్రైలర్ మొదలైంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. భారత్ లో ఎన్నో దాడులకు పాల్పడిన 'ఇండియాస్ ఒసామా' అనే ఉగ్రవాదిని పట్టుకోవడం కోసం దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏం చేశారనే పాయింట్ తో సినిమా సాగనుంది.
ఆ ఐదుగురు వ్యక్తుల వద్ద ఎలాంటి ఆయుధాలు ఉండవు. అయినా ఉగ్రవాదిని పట్టుకోవడం కోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా సిద్ధపడతారు. వారిలో ఒకరే అర్జున్ రెడ్డి. మే 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.