12th Fail : ‘12th ఫెయిల్’ మూవీ అరుదైన ఘనత.. అత్యధిక రేటింగ్ పొందిన చిత్రంగా గుర్తింపు!
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా వచ్చిన చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’ 12th Fail. గతేడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది. ఇక తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సాధించింది.
![IMDB Gave Highest Rating to 12th Fail Movie NSK IMDB Gave Highest Rating to 12th Fail Movie NSK](https://static-ai.asianetnews.com/images/01hkpcyc74fcneamtz1f1qpn79/fotojet---2024-01-09t112818-902_363x203xt.jpg)
చిన్నసినిమాలుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న చిత్రాల గురించి వింటూనే ఉన్నాం. ‘కాంతార’, ‘బలగం’, ‘2018’ వంటి సినిమాలు ఇలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇతర భాషల్లో హిట్ అయిన చిత్రాలు వారం తర్వాత డబ్ అయి తెలుగులోనూ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. డబ్డ్ వెర్షన్ లోనూ ఆ సినిమాలు మంచి విజయాన్ని పొందుతున్నాయి. ఈ క్రమంలో హిందీలో మంచి ఆదరణ పొందిన `ట్వెల్త్ ఫెయిల్` (12th Fail) మూవీ 2023, నవంబర్ 3న తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక్కడి ఆడియెన్స్ ను కూడా ఈ మూవీ బాగా ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగానూ ‘జెర్సీ’, ‘ఆకాశమే నీ హద్దురా’ వంటి చిత్రాలను మించి రూ.66 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇలా ప్రేక్షకాదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచ సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) సంస్థ ఈ చిత్రానికి అత్యధిక రేటింగ్ ను ఇచ్చింది.
12th ఫెయిల్ చిత్రానికి అత్యధిక రేటింగ్ ఇచ్చింది. దీంతో ఆ చిత్రం ఇండియన్ సినిమాల్లో టాప్ రేటింగ్ దక్కించుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో సందడి చేసిన ‘ఓపెన్ హైమర్’కు ఐఎండీబీ 8.4, ‘స్పైడర్ మ్యాన్ : ఆక్రాస్ ది స్పైడర్ వెర్స్’కు 8.6 రేటింగ్ ఇచ్చింది. కానీ ‘ట్వెల్త్ ఫెయిల్’ చిత్రానికి మాత్రం 9.2 రేటింగ్ ఇవ్వడం విశేషంగా మారింది.
ఇక ఈ చిత్రం నిజజీవిత కథతో తెరకెక్కడంతో ప్రేక్షకులు ఆదరించారు. 12వ తరగతి ఫెయిల్ అయిన కుర్రాడు ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడనేది చిత్రం. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ తో ఆస్కార్ Oscar బరిలోనూ పోటీపడుతోంది. ఇప్పటికే ఇండిపెండెంట్ గా మేకర్స్ నామినేషన్ కూడా వేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత విధూ వినోద్ చోప్రా డైరెక్ట్ చేశారు. యోగేష్ ఈశ్వర్తో కలిసి వినోద్ చోప్రా నిర్మించారు. విక్రాంత్ మెస్సీ హీరోగా నటించగా, మేథా శంకర్ హీరోయిన్గా, ఆనంద్ వీ జోషి, ప్రియాంశు చట్టర్జీ కీలక పాత్రల్లో నటించారు.