నేనూ క్యాన్సర్ బారినపడ్డా : బాంబు పేల్చిన చిరంజీవి
తాను కూడా క్యాన్సర్ బారినపడ్డానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ముందుగా గుర్తించి దానికి చికిత్స తీసుకున్నానని ఆయన తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను క్యాన్సర్ బారినపడ్డారని ఆయన బాంబు పేల్చారు. హైదరాబాద్లో శనివారం ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుని తాను ప్రాణాలతో బయటపడ్డానని చిరంజీవి వెల్లడించారు. క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి తానేం భయపడలేదని.. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పెద్ద జబ్బు కాదన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.