జాన్వీ సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రహం
గుంజన్ సక్సెనా సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో గుంజన్ పాత్రను హైలెట్ చేయటం కోసం ఎయిర్ ఫోర్స్ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఐఏఎఫ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్కు లేఖ రాసింది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ గుంజన్ సక్సెనా. ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కరోనా కారణంగా ఓటీటీలోనే విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో స్థానం సంపాందించిన గుంజన్ సక్సెనా జీవిత కథ ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో గుంజన్ పాత్రను హైలెట్ చేయటం కోసం ఎయిర్ ఫోర్స్ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఐఏఎఫ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్కు లేఖ రాసింది. ఈ లేఖలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గతంలో నెట్ఫ్లిక్స్, ధర్మా ప్రొడక్షన్స్ ఐఏఎఫ్ను ప్రొజెక్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు వహిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్, గుంజన్ సక్సెనా పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాపై ఐఏఎఫ్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.