పదహారేళ్లకే నాపై అత్యాచారం జరిగింది.. ప్రముఖ టీవీ యాంకర్ కామెంట్స్!
ప్రముఖ భారతీయ-అమెరికా టీవీ యాంకర్ పద్మాలక్ష్మి.. బాల్యం నుండి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రముఖ భారతీయ-అమెరికా టీవీ యాంకర్ పద్మాలక్ష్మి.. బాల్యం నుండి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 16 ఏళ్ల వయసులోనే ఆమెపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని వెల్లడించింది.
''నాకు 16 ఏళ్ల వయసున్నప్పుడు 23 ఏళ్ల ఓ వ్యక్తితో డేటింగ్ చేశాను. మా రిలేషన్ మొదలైన కొంత కాలానికే అతడు నాపై అత్యాచారం చేశాడు. అంటే ఒక మగాడు తన లైంగిక వాంఛ కోసం మాత్రం స్త్రీతో బంధాన్ని కోరుకుంటాడా..? తనను నమ్మి వచ్చిన అమ్మాయిని ఓ బానిసగా చూస్తాడా..? ఆమె ఇష్టాయిష్టాలతో పని ఉండదా అనిపించింది. ఆ టైమ్ లో నాకు నేను చాలా వీక్ గా అనిపించాను.
కనీసం నాపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పుకోలేకపోయాను. దానికి కారణం.. నాకు ఏడేళ్ల వయసులో మా బంధువు ఒకరు నాతో తప్పుగా ప్రవర్తించారు. ఆ విషయాన్ని అమ్మకి చెబితే నన్ను ఇండియాలో మా అమ్మమ్మ ఇంటికి పంపించేసి ఏడాది పాటు అక్కడే ఉంచింది. ఎవరో చేసిన తప్పుకి శిక్ష నేను అనుభవించాను.
ఈ సమాజం మగవాడు తప్పు చేసినా.. ఆడదాన్నే నిందిస్తుంది. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. నేను పడిన బాధ నా కూతురు పడకూడదు. తనకు ఎలాంటి సమస్య వచ్చినా.. నేను తోడుగా ఉంటాననే నమ్మకం ఆమెకు కల్పించాలి. ప్రతి తల్లి కూడా ఇలానే ఆలోచించాలి. తల్లితండ్రులకు మించిన ఆప్తులు పిల్లలు మరెవరూ ఉండరు'' అంటూ చెప్పుకొచ్చింది.