Asianet News TeluguAsianet News Telugu

ఏడాది క్రితం నేను డిప్రెషన్లో ఉన్నా


సినిమా పరిశ్రమలో హిట్ లు, ప్లాఫ్ లు కామన్. అలాగే ఫ్లాఫ్ లు వచ్చినప్పుడు ఎంతటివారైనా నిరాశకు గురి అవటం సహజం. అవి సిని పరిశ్రమలో కాస్తంత ఎక్కువ. డిప్రెషన్ కు చాలా మంది గురి అవుతూంటారు.ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అయితే అవి బయిటకు రివీల్ చేయటానికి ఇష్టపడరు. చిరు నవ్వుతో అంతా బాగుందనే కలర్ ఇచ్చి జీవితం గడిపేస్తారు. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం నిజాన్ని చెప్పటానికి భయలేదు.
 

I Was In Depression One Year Ago: Prashanth Varma jsp
Author
Hyderabad, First Published Feb 3, 2021, 4:37 PM IST

 ఏడాది క్రితం తాను డిప్రెషన్కు గురయ్యానని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు.  ‘కల్కి’ సినిమా విడుదలైన తరువాత వివిధ కారణాలతో తాను తీవ్ర నిరాశలో ఉన్నానని పేర్కొన్నారు. రాజశేఖర్ తనను తన కథను నమ్మారని అన్నారు. లాక్డౌన్ విరామం తర్వాత.. వస్తున్న జాంబీ రెడ్డికి మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాని అన్నారు ప్రశాంత్.

ప్రశాంత్ వర్మ లేటెస్ట్ మూవీ జాంబీ రెడ్డి. ఈ చిత్రంతో బాలనటుడు తేజ హీరోగా పరిచం అవుతున్నాడు. ఫిబ్రవరి 5 న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్.. హైదరాబాద్ లో జరిగింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకులు బాబీ తరుణ్ భాస్కర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఈ విషయం రివీల్ చేసారు.

తేజ సజ్జ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘జాంబీరెడ్డి’. ‘అ!’, ‘కల్కీ’ సినిమాల డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆనంది, దక్ష నగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా హీరో వరుణ్‌తేజ హాజరయ్యారు. 

డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించామన్నారు. తెలుగులో వస్తున్న తొలి జాంబీ చిత్రమిదే. ఈ చిత్రానికి యూనిట్‌ సభ్యులంతా చాలా కష్టపడ్డట్లు వారు చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా తెలుగులో తాము కొత్త ప్రయోగంతో మంచి సినిమా తీశామని, అందరూ స్వాగతించి.. సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ తొలి టికెట్‌ను కొనుగోలు చేశారు. 

‘అ’ వంటి విభిన్నమైన కథతో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ సినిమా చేసాడు. ఈ సినిమాకూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం`జాంబిరెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటివరకు తెలుగులో ఎవ్వరు తెరకెక్కించని మరో విభిన్నమైన కథతో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios