ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా సంస్థ భారీగా అర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచింది. ఆ సంస్థ ఛైర్మెన్ చిన్న వాసుదేవ రెడ్డి పది లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా సంస్థ భారీగా అర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచింది. ఆ సంస్థ ఛైర్మెన్ చిన్న వాసుదేవ రెడ్డి పది లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. స్వయంగా గురువారం ఇటికెళ్లి వారి కుటుంబానికి చెక్ని అందించారు. ఇటీవల కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి సినిమా పరిశ్రమని సైతం షాక్కి గురి చేసింది. సినీ జర్నలిస్ట్ లు దిగ్ర్భాంతికి గురయ్యారు. `ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్` షో ద్వారా పాపులర్ అయ్యారు టీఎన్ఆర్. ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారమయ్యే `ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్` అనే షోకి యాంకర్గా వ్యవహరించారు టీఎన్ఆర్.
టీఎన్ఆర్ పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం టీఎన్ఆర్ పిల్లలతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులకు సైతం కరోనా సోకిందని, అదృష్టవశాత్తు వారిలో ఎవరికి సీరియస్గా లేదని తెలిపారు. అపోలో హాస్పిటల్స్ నుంచి ప్రముఖ వైద్యులు ఒకరు టీఎన్ఆర్ కుటుంబానికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.
`టీఎన్ఆర్ కేవలం ఐ డ్రీమ్ సంస్థకు ఉద్యోగి మాత్రమే కాదు. వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు, స్నేహితుడు. సంస్థ ఎదుగుదలకు టీఎన్ఆర్ ఎన్నో సూచనలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండటం నా బాధ్యత. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, జ్యోతి(టీఎన్ఆర్ భార్య)కి కావాల్సిన నైతిక, ఆర్థిక మద్దతు అందజేసే విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. వ్యక్తిగా TNR మన మధ్య లేకపోయినా ఆయన విడిచి వెళ్లిన జ్ఞాపకాలు, చేసిన కళాసేవ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి` అని పేర్కొన్నారు.
