Asianet News TeluguAsianet News Telugu

ఈ ఒక్క పోస్టరే కోట్ల బిజినెస్ తెచ్చిపెడుతోంది

సినిమావాళ్లకు పబ్లిసిటీ గురించి బాగా తెలుసు. ఏ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి..ఎలా ట్రైలర్ కట్ చేయాలి వంటి విషయాల్లో పండిపోయి ఉంటారు.

Huge Demand For Adivi Sheshu's Evaru Rights
Author
Hyderabad, First Published Jul 14, 2019, 3:03 PM IST

సినిమావాళ్లకు పబ్లిసిటీ గురించి బాగా తెలుసు. ఏ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి..ఎలా ట్రైలర్ కట్ చేయాలి వంటి విషయాల్లో పండిపోయి ఉంటారు. ట్రైలర్, టీజర్ విడుదల అవ్వగానే క్రేజ్ వచ్చి తమ సినిమా రైట్స్ అమ్ముడుపోవాలని ఆశపడతారు. అయితే కొన్ని సార్లు అది జరుగుతూంటుంది. సినిమాలో విషయం ఏంటో తెలియకపోయినా క్రేజ్ చూసి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ రైట్స్ కోసం ఎగబడతారు. ఇప్పుడు అడవి శేషు తాజా చిత్రం విషయంలో ట్రైలర్, టీజర్ దాకా కూడా వెళ్లకుండానే కేవలం పోస్టర్ తోనే బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం. 

అడవి శేషు నటించిన `క్ష‌ణం` సినిమా ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించిందో అంద‌రికీ తెలుసు.  అతి తక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇప్పుడు మ‌రోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేష‌న్‌లో ఓ థ్రిల్ల‌ర్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి `ఎవ‌రు` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రీసెంట్ గా  ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను   విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ ట్రేడ్ వర్గాలను బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ రైట్స్ కోసం పెద్ద సంస్దలు సైతం పోటీ పడుతున్నాయి. కోటిన్నర ని నిర్మాతలు ఓవర్ సీస్ రైట్స్ కు కోట్ చేసినట్లు తెలుస్తోంది.  అలాగే ఆంధ్ర, తెలంగాణాలో కూడా అదే స్దాయిలో బేర సారాలు జరుగుతున్నాయి. 

ఈ చిత్రంతో వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు.
క్ష‌ణం, గూఢ‌చారి సినిమాలతో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను సాధించిన అడివిశేష్ హీరోగా న‌టిస్తుండ‌గా, రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తోంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 23న విడుద‌ల చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios