దృశ్యం-2’ ఓటీటీ రిలీజ్ కన్ఫమ్.. ఇంతకి ఏ ఓటీటిలో అంటే..
వెంకటేశ్, మీనా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దృశ్యం2’. ఈ చిత్రం ఓటీటి రిలీజ్ కు రెడీ అయ్యిందని సమాచారం. ఈ మేరకు నిర్మాత సురేష్ బాబు ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.
మోహన్లాల్-మీనా జంటగా నటించిన మలయాళీ చిత్రం ‘దృశ్యం-2’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమేజాన్ వేదికగా విడుదలై ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు. వెంకటేశ్-మీనా జంటగా చేసిన ఈ చిత్రానికి మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
2014లో విడుదలైన ‘దృశ్యం’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటి బాట పడుతోంది. హాట్ స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ కు రంగం సిద్దం మవుతోంది. థియోటర్ రిలీజ్ కావటం లేదని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం కేవలం నలభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. స్టార్ మా, డిస్నీ+హాట్ స్టార్ కలిపి మంచి రేటుకు ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో వెంకటేశ్ సతీమణిగా మీనా కనిపించనున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పార్ట్-3కి కూడా డైరెక్టర్ జీతూ స్క్రిప్ట్ను మలిచే పనిలో ఉన్నట్టు ఇటీవలే వెల్లడించారు. మరోవైపు వెంకీ నటించిన ‘నారప్ప’తో పాటు ‘ఎఫ్3’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.