‘అవతార్’, ‘జురాసిక్ వరల్డ్’ టీమ్ లు క్వారంటైన్ లో
ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవతార్’ సీక్వెల్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. న్యూజిలాండ్లోని 20th సెంచురీ స్టూడియోస్లో దీన్ని మొదలు పెట్టారు. నిర్మాత జోన్ ల్యాండ్, నటీనటులు, సాంకేతిక టీమ్ కి రెండు వారాల క్వారంటైన్ కాలం ముగిసింది. అందరికీ కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అయ్యాకే షూటింగ్ను మొదలు పెట్టారు.
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన షూటింగ్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఒక్కో దేశం ఆంక్షలను సడలిస్తుండటంతో సినిమావాళ్లు షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా భారీ పెట్టుబడులు పెట్టిన వారు ముందుకు దూకుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్దలు అన్ని జాగ్రత్తలతో ముందుగా షూటింగ్కు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే కరోనాతో అందరూ మొదట క్వారంటైన్ లో ఉండాల్సి వస్తోంది. రోజు వారి పరీక్షలు చేస్తున్నారు. 14 రోజులు క్వారంటైన్ తర్వాతే షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవతార్’ సీక్వెల్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. న్యూజిలాండ్లోని 20th సెంచురీ స్టూడియోస్లో దీన్ని మొదలు పెట్టారు. నిర్మాత జోన్ ల్యాండ్, నటీనటులు, సాంకేతిక టీమ్ కి రెండు వారాల క్వారంటైన్ కాలం ముగిసింది. అందరికీ కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అయ్యాకే షూటింగ్ను మొదలు పెట్టారు.
జులై మొదటివారం నుంచి ‘జురాసిక్ వరల్డ్: డొమిని’ చిత్ర షూటింగ్ను ప్రారంభించనున్నట్లు యూనివర్సల్ స్టూడియోస్ వెల్లడించింది. ఇంగ్లాండ్లోని పైన్వుడ్ స్టూడియోలో జులై 6వ తేదీ నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని నటీనటులు, టెక్నీషియన్స్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తామని తెలిపింది. ‘జురాసిక్ వరల్డ్ 3’పైనే అందరి దృష్టి ఉంది. కొందరు రచయితలతో కలిసి చిత్రదర్శకుడు కోలిన్ ట్రెవరో ఈ భాగానికి రాసిన స్క్రిప్ట్ అదిరిపోయే రేంజ్లో ఉందని కీలక పాత్రధారి క్రిస్ ప్రాట్ పేర్కొన్నారు.
‘‘గత ఏడాది విడుదలై, ఘనవిజయం సాధించిన ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’కి దీటుగా తాజా జురాసిక్ చిత్రం ఉంటుంది. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన గత చిత్రాలకన్నా ఈ చిత్రకథ మరింత కిక్ ఇచ్చే విధంగా ఉంది. తొలి భాగంలో నటించిన స్యామ్ నీల్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్బ్లమ్ కూడా ఈ చిత్రంలో నటిస్తారు. భారీ స్థాయిలో రాబోతున్న చిత్రం ఇది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు క్రిస్ ప్రాట్.
‘జురాసిక్ వరల్డ్: డొమిని’లో క్రిస్ పాట్, బ్రేసీ డల్లాస్ హార్వర్డ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందమంతా యూకేకు చేరుకుంది. రెండు వారాల క్వారంటైన్లో ఉండనున్నారు. అనంతరం అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే రోజూ శరీర ఉష్ణోగ్రతలు పరీక్షిస్తున్నారు.