Asianet News TeluguAsianet News Telugu

'వాల్మీకి' : వరుణ్ తేజ్ కి నోటీసులు!

మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన వాల్మీకి సినిమాను సమస్యలు వెంటాడుతున్నాయి. ఈసినిమా టైటిల్‌ ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్‌ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా టైటిల్‌ తమను కించపరిచే విధంగా ఉందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.
 

High Court Issues Notice to Valmiki Movie Team and Varun Tej
Author
Hyderabad, First Published Sep 13, 2019, 3:10 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'వాల్మీకి' అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది. గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ఎలా పెడతారంటూ బీసీ సంక్షేమ సంఘాలు గొడవకి దిగుతున్నాయి.

వాల్మీకి సినిమా పేరునువెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో బోయ సంఘాలు తమ కులానికి చెందిన వ్యక్తి పేరుని టైటిల్ గా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ షూటింగ్ జరక్కుండా అడ్డుకున్నాయి. ఇటీవల కూడా టైటిల్ మార్చాలని ధర్నా చేపట్టారు. అయితే చిత్రబృందం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు.

ఇటీవల వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూబోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్‌ బోర్డు, ఫిలిం ఛాంబర్‌లతో పాటు హీరో వరుణ్‌ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ పై నిర్మించారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది.  త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios