డీజే టిల్లు సీక్వెల్ కు తప్పని తిప్పలు.. వరుసగా తప్పుకుంటున్న స్టార్స్..
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీస్ లో చోటు సంపాధించుకుంది డీజే టిల్లు మూవీ.. వెంటనే ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశారు. ప్లాన్ అయితే చేశారు కాని.. సినిమాకు ఆది నుంచి అనర్థాలే ఎదురవుతున్నాయి. మొన్న డైరెక్టర్.. ఇప్పుడు హీరోయిన్ రేపు ఇంకెవరలో.. వరుసగా షాకులిస్తున్న స్టార్స్...
సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా.. మాస్ ఎలిమెంట్స్ తో... రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈ మూవీ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల లో ఒకటిగా నిలిచింది. ఈఏడాది మార్చ్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చెడుగుడాడేసింది. చిన్నసినిమాగా రిలీజ్ అయ్యి.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు డిజే టిల్లు. ఇక ఈ సినిమాతో సిద్ధు ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా స్టార్ ఇమేజ్ సాధించాడు సిద్థు. ఎన్నో ఏళ్ళ నుంచి గుర్తింపు కోసం ఎదురు చేస్తున్న సిద్ధూకు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.
అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సిద్దు జొన్నల గడ్డకు.. ఈసినిమాతో మరింత ఇమేజ్ పెరిగిపోయింది. ఇక ఇవన్నీ దష్టిలో పెట్టుకుని వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు మేకర్స్. కాని ఈ సినిమా స్టార్ట్ కాకముందే అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి మేకర్స్ కు. ఫస్ట్ పార్ట్ లో తెలంగాణ యాసలో సిద్ధూ చెప్పే డైలాగ్స్ ఉర్రూతలూగించాయి.. వాటికి తోడు నేహా శెట్టి అందాల ఆరబోత సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్ళింది. ఇక సీక్వెల్ లో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేశారు. కాని ఆది నుంచి ఇబ్బందులు తప్పడంలేదు టీమ్ కు.
ఈ సినిమా కథ విషయంలో హీరోతో అభిప్రాయ బేదాలు వచ్చి..డైరెక్టర్ విమల్ కృష్ణ కూడా తప్పుకున్నాడు. ఈ మూవీకి కథ సిద్థూనే అందించారు. సీక్వెల్ కు కూడా సిద్థూనే కథ అందిస్తున్నాడు. అంతే కాదు డీజే టిల్లు లో నేహా శెట్టి పాత్ర అయిపోయింది.. ఇక సీక్వెల్లో అంతకు మించి ఉండాలనుకున్న మేకర్స్ హీరోయిన్ కోసం శ్రీలీలను ఎంపిక చేశారు. కాగా ఇప్పుడు శ్రీలీల ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఇప్పుడు శ్రీలీల కూడా ఈ మూవీనుంచి తప్పుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ మరింత ఆలస్యమవ్వక తప్పేలా లేదు.
కాని మంచి కాంబినేషన్ లు అన్నీ ఒక్కక్కరుగా తప్పుకోవడంతో.. డీజే టిల్లూ సీక్వెల్ పై నెగెటీవ్ ఎపెక్ట్ పడుతుందేమో అని అనుకుంటున్నారు సినిమా జనాలు. హీరో సిద్థూ మాత్రం ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందించాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సిద్థు చేతిలో ప్రస్తుంతం రెండు సినిమాలున్నాయి.