Asianet News TeluguAsianet News Telugu

Samantha: హ్యాష్ అండ్ సాషా నే సమంత పిల్లలు, ఒంటరితనానికి తోడు!


ఒంటరైన సుమంత జీవితంలో ఇద్దరు కీలకైన వారు ఉన్నారు. హ్యాష్, సాషానే ఆమె ప్రపంచం. వారిని ఉద్దేశిస్తూ సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. 
 

heroine samantha shares an interesting photo with fans
Author
First Published Jan 13, 2023, 5:42 PM IST

సమంత ఒంటరి జీవితం అనుభవిస్తుంది. నాగ చైతన్యతో విడాకులు అయ్యాక ఆమె హైదరాబాద్ లో తన నివాసంలో ఒక్కరే ఉంటున్నారు. అయితే ఆమెకు ఇద్దరి తోడు ఉంది. వారు ఎవరో కాదు హాష్, సాషా. సమంత లోన్లీ ఫీలింగ్ దూరం చేసే బాధ్యత వాటిదే. ఇక సమంత సోషల్ మీడియా పోస్ట్స్ ఫాలో అయ్యేవాళ్ళకు హ్యాష్, సాషా ల గురించి తెలుసు. అవి సమంత పెట్ డాగ్స్. నాగ చైతన్యతో విడిపోక ముందు నుంచే సమంత వద్ద హ్యాష్ ఉంది. కొత్తగా సాషా అనే మరో పెట్ డాగ్ ని సమంత కొన్నారు. 

విరామ సమయంలో వాటితో గడపడం సమంతకు ఇష్టమైన వ్యాపకం. ఆ రెండు డాగ్స్ ని తన సొంత పిల్లలు మాదిరి చూసుకుంటుంది. తాజాగా సమంత వాటిని ఉద్దేశిస్తూ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. సోపాలో బోర్లా పడుకున్న సమంత వీపుపై హ్యాష్ కాలు పెట్టింది. ఆ ఫోటో అభిమానులతో సమంత పంచుకున్నారు. దానికి సమంత ఇచ్చిన కామెంట్... 'నువ్వు బాధపడకమ్మా... నీ వెనుక నేనున్నా, అని. నీకు ఏమైనా చూసుకోవడానికి నేనున్నా అని హ్యాష్ తనకు ధైర్యం చెబుతుందన్న అర్థంలో సమంత ఆ కామెంట్ పెట్టారు. 

కాగా సమంత ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. ఆమె లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. శాకుంతలం ట్రైలర్ ఆకట్టుకుంది. సమంత టైటిల్ రోల్ శకుంతలగా నటిస్తున్నారు. దుష్యంతుడిగా మలయాళ నటుడు మోహన్ దేవ్ చేస్తున్నారు. వీరి పుత్రుడు భరతుడు పాత్ర అల్లు అర్హ చేస్తుంది. మోహన్ బాబు కీలకమైన దుర్వాస మహర్షి రోల్ చేస్తున్నారు. 

ఫిబ్రవరి 17న శాకుంతలం వరల్డ్ వైడ్ 5 భాషల్లో విడుదల కానుంది. ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సమంత ఎమోషనల్ అయ్యారు. గుణశేఖర్ ఆమె గురించి పొగుడుతుండగా కన్నీరు పెట్టుకున్నారు. ఓపిక లేకపోయినా గుణశేఖర్ కోసం ఈ ఈవెంట్ కి వచ్చానని చెప్పారు. దిల్ రాజు శాకుంతలం నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios