Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ అయినంత మాత్రాన అవి వదిలేయాలా?... విమర్శకులకు ప్రణీత కౌంటర్ 


హీరోయిన్ ప్రణీత సుభాష్ భర్తకు పాద పూజ చేయడాన్ని కొందరు తప్పు బట్టారు. ఈ రోజుల్లో కూడా ఇవేమి ఆచారాలు అంటూ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ప్రణీత స్పందించారు. 
 

heroine pranitha subhas reacts to the social media trolls
Author
Hyderabad, First Published Aug 4, 2022, 7:38 AM IST

భీమన అమావాస్య సందర్భంగా ప్రణీత(Pranitha Subhash) తన భర్త నితిన్ రాజుకు పాద పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ కాలం జనాలకు అది వింతగా తోచింది. ఈ రోజుల్లో కూడా భర్తకు పాద పూజ చేయడం ఏమిటీ? ఇంకా ఏ కాలంలో ఉన్నారు? భార్య పాద పూజ భర్తకే ఎందుకు చేయాలి? భర్త భార్యకు చేయకూడదా? అంటూ పలు రకాల విమర్శలతో దాడికి దిగారు. ఈ నేపథ్యంలో సదరు విమర్శలకు ప్రణీత స్పందించారు. 

సమాజంలో 90 శాతం మంది పాజిటివ్ గా స్పందిస్తారు. మిగిలినవారు నెగిటివ్ మైండ్ కలిగి ఉంటారు. భీమన అమావాస్య నాడు భర్తకు పాద పూజ చేయడం మన సాంప్రదాయం. మా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చుట్టూ ఉన్నవారు కూడా ఇది చేశారు. హీరోయిన్ అయినంత మాత్రాన సాంప్రదాయాలు వదిలివేయాలా?. చిన్నప్పటి నుండి వాటిని చూస్తూ పెరిగాను. నేను కూడా వాటిని తప్పకుండా పాటిస్తాను. ఎవరో కొందరు అన్నారని నేను పట్టించుకోను.గత ఏడాది కూడా నేను ఈ పాద పూజ చేశాను. కాకపోతే అప్ప్పుడు ఆ ఫోటోలు షేర్ చేయలేదు.. అంటూ ఆమె కౌంటర్లు విసిరారు. ప్రస్తుతం ప్రణీత కామెంట్స్ వైరల్ గా మారాయి. 

ఇక 2021 మే నెలలో ప్రణీత  బిజినెస్ మాన్ నితిన్ రాజుని వివాహం చేసుకున్నారు. ఇటీవల ఆమె ఓ అమ్మాయికి జన్మనిచ్చారు. లాక్ డౌన్ సమయంలో ప్రణీత పేదవారికి చేసిన సేవలు ప్రాచుర్యం పొందాయి. ఆమె ప్రతిరోజు కొందరు పేదవారికి ఆహారం అందించారు. కాగా  తెలుగులో అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ లో రెండో హీరోయిన్ గా ప్రణీత నటించారు. ఆమె తెలుగులో చేసిన చివరి  కథానాయకుడు. పెళ్ళైన తర్వాత కూడా ప్రణీత కెరీర్ కొనసాగిస్తున్నారు. రావణ అవతార అనే కన్నడ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios