Asianet News TeluguAsianet News Telugu

స్వతహాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నందిత శ్వేత..శారీలో సూపర్‌

`మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఎంతో ముఖ్యం` అని తెలిపింది హీరోయిన్‌ నందిత శ్వేత. ఎంపీ సంతోష్‌ కుమార్‌ జోగిని పల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వతహాగా స్వీకరించిన నందిత శ్వేత శనివారం గచ్చిబౌలిలో మొక్కలు నాటింది. 

heroine nadita swetha participate in green india challenge arj
Author
Hyderabad, First Published Jan 23, 2021, 7:29 PM IST

`మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఎంతో ముఖ్యం` అని తెలిపింది హీరోయిన్‌ నందిత శ్వేత. ఎంపీ సంతోష్‌ కుమార్‌ జోగిని పల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వతహాగా స్వీకరించిన నందిత శ్వేత శనివారం గచ్చిబౌలిలో మొక్కలు నాటింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, `గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం గురించి తెలుసుకుని స్వతహాగా ఛాలెంజ్‌ని స్వీకరించానని చెప్పింది. 

ఇంకా చెబుతూ, మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఛాలెంజ్‌ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని చెప్పింది. ఇంత మంది కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకువెళ్తున్న సంతోష్‌ కుమార్‌కి థ్యాంక్స్` అని చెప్పింది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌, హీరో నిఖిల్‌, `కల్కి` సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్‌ లకు ఛాలెంజ్‌ విసిరింది. ప్రస్తుతం నందిత శ్వేత తెలుగులో `ఐపీసీ 376`, `కపటదారి` చిత్రాల్లో నటిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios