Asianet News TeluguAsianet News Telugu

తమిళ దర్శకుడికి షాక్ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్, తెలుసుకుని మాట్లాడాలంటూ.. వార్నింగ్

తమిళ దర్శకుడికి షాక్ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తనపై తప్పుడు మాటలు మాట్లాడినందకు డైరెక్టర్ కు గట్టిగా ఇచ్చిపడైసింది. ఇంతకీ విషయం ఏంటంటే..?  

Heroine Aishwarya Rajesh Strong Warning To Tamil Director JMS
Author
First Published Jan 31, 2024, 1:48 PM IST

తెలుగు సినిమా కుటుంబానికి చెందిన ఐశ్వర్య రాజేష్ .. తమిళనాట హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి మంచి పేరు సాధించుకుంది.  తమిళంలో చిన్న పాత్రలతో స్టార్ట్ చేసి.. అక్కడ  వరుసగా సినిమాలు చేస్తుంది బ్యూటీ. 2018లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి  అడుగుపెట్టింది ఈ చిన్నది. అంతకు ముందు చాలా తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 

ఇక తెలుగులోకి హీరోయిన్ గా విజయ్ దేవరకొండతో  వరల్డ్ ఫెమస్ లవర్, నాని తో టక్ జగదీశ్, సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది  ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలన్నీ  హిట్ అయినా కాకపోయినా..  ఐశ్వర్య రాజేష్ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇక ఈమధ్య తెలుగు సినిమాలు తగ్గించింది ఐశ్వర్య.. ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తోంది.  బ్యాక్ టు బ్యాక్ తమిళ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. 

 

ఇది ఇలా ఉంటే.. రీసెంట్ గా  ఐశ్వర్య రాజేష్ పై ఓ దర్శకుడు సంచలన వాఖ్యలు చేశారు. తమిళనాట మంచిమంచి సినిమాలు చేసిన వీరపాండియన్ ఐశ్వర్య రాజేష్ పై నోరు జారి షాకింగ్ కామెంట్స్ చేశారు.  అసలు ఇండస్ట్రీకి తానే ఐశ్వర్య రాజేశ్‌ని పరిచయం చేశాడని.. ఇప్పుడు తనను ఇప్పుడు లెక్క చేయకుండా..  స్టార్ హీరోయిన్ అయ్యి ఫోజులు కొడుతుంది అన్నారు.నేను డైరెక్ట్ చేసిన సినిమాతోనే ఐశ్వర్య రాజేశ్‌ పరిచయం అయ్యింది.. ఆ విషయం ఆమె ఎక్కడా కూడా చెప్పలేదు అన్నారు. 

ఇక ఇప్పుడు ఐశ్వర్యకు స్టార్ డమ్ రావడంతో.. నన్ను లెక్క చేయడంలేదు.. ఆమెతో సినిమా చేయాలి అనుకుంటే..  నాతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.. ఒకప్పుడు  ఆమె చేతిలో డబ్బులు లేకుంటే.. ఆటోకు కూడా డబ్బులు నేనే ఇచ్చాను.. అని అన్నారు. ఇక ఈ వాఖ్యలపై ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియా ద్వారా గట్టిగా స్పందించింది. ఆ దర్శకుడి పేరు ఎత్తకుండా.. లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. ఆయన పేరు ఎత్తకుండా ఓ ట్వీట్ చేశారు. 

చాలా మంది ఒక వైపే విని మాట్లాడుతూ ఉంటారు. అసలు విషయాలు తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే.. పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే  బాగుంటుంది” అంటూ రాసుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. అయితే ఐశ్వర్య పరోక్షంగా వీరపాండ్యన్ నే టార్గెట్ చేసి ఆ ట్వీట్ చేసిందని అంటున్నారు కొందరు నెటిజన్స్.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios