Asianet News TeluguAsianet News Telugu

దారుణం... 'నువ్వు నేను' హీరోయిన్ ని ఆయన తెగ ఏడిపించేస్తున్నాడట!

2013లో బిజినెస్ మాన్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న అనిత, పెళ్లి తరువాత కూడా నటన కొనసాగిస్తున్నారు. 2021లో ఫిబ్రవరిలో ఈ జంట పేరెంట్స్ గా మారారు. పండంటి మగ బిడ్డకు అనిత జన్మనివ్వగా, ఆరవ్ రెడ్డి అని నామకరణం చేశారు.

heroin anitha hassanandini social media post goes viral as she shares romantic moments ksr
Author
Hyderabad, First Published Jul 2, 2021, 8:16 AM IST

నువ్వు నేను, తొట్టి గ్యాంగ్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల బాగా దగ్గరైన నార్త్ బ్యూటీ అనిత హస్సానందాని. మంచి ఆరంభం లభించినా స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది అనిత. అయితే సౌత్ లో పలు బాషలలో చాలా సినిమాలే చేసింది. ప్రస్తుతం అనిత బాలీవుడ్ సీరియల్ యాక్ట్రెస్ గా కొనసాగుతున్నారు. ఎప్పటి నుండో వెండితెరను, బుల్లితెరను బ్యాలన్స్ చేస్తూ నటిస్తుంది అనిత. 

2013లో బిజినెస్ మాన్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న అనిత, పెళ్లి తరువాత కూడా నటన కొనసాగిస్తున్నారు. 2021లో ఫిబ్రవరిలో ఈ జంట పేరెంట్స్ గా మారారు. పండంటి మగ బిడ్డకు అనిత జన్మనివ్వగా, ఆరవ్ రెడ్డి అని నామకరణం చేశారు. అనిత, రోహిత్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 


తాజాగా అనిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. భర్తతో రొమాంటిక్ ఫోజులో ఉన్న ఫోటో పంచుకున్న అనిత 'ఈ ప్రపంచంలో నీకంటే నన్ను ఏడిపించే వారు మరొకరు లేరు. నాకు చికాకు అనిపించే క్షణాల్లో నీతోనే ఉండాలని అనుకుంటాను..' అంటూ కామెంట్ చేసింది. అనిత సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో పాటు ఈ కపుల్ ఎంత రొమాంటిక్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. రోహిత్ రెడ్డి తన అపరిమితమైన ప్రేమతో భార్యను అంతగా ఏడిపిస్తున్నాడన్న మాట. 

Follow Us:
Download App:
  • android
  • ios