తెలుగులో భల్లాలదేవ.. తమిళంలో మక్కల్ సెల్వన్.. నిశ్శబ్దం ట్రైలర్
`నిశ్శబ్దం` చిత్ర ట్రైలర్ రేపు(సోమవారం) విడుదల కాబోతుంది. తెలుగు ట్రైలర్ని భల్లాలదేవ రానా విడుదల చేయబోతున్నారు. తమిళ ట్రైలర్ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయనున్నారు.
అనుష్క నటిస్తున్న హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ `నిశ్శబ్దం` అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదల కాబోతుంది. అమేజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్కి సిద్ధమైంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ సందడి షురూ అయ్యింది.
ఈ చిత్ర ట్రైలర్ రేపు(సోమవారం) విడుదల కాబోతుంది. తెలుగు ట్రైలర్ని భల్లాలదేవ రానా విడుదల చేయబోతున్నారు. అలాగే తమిళ ట్రైలర్ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1కి ఈ ఇద్దరు స్టార్స్ రెండు భాషల ట్రైలర్స్ ని పంచుకోబోతున్నారు. దీంతో సినిమాపై అటెన్షన్ మరింతగా పెరిగింది.
ఇక హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్ మాధవన్, అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అనుష్క.. సాక్షి అనే మూగ ఆర్టిస్టుగా నటిస్తుండగా, మాధవన్ సెలబ్రిటీ మ్యూజీషియన్గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ట్రైలర్ ఏం రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.