నా ట్విటర్ నా ఇష్టం.. నెటిజెన్పై ఫైర్ అయిన హీరో
కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన సందీప్ కిషన్కు ఓ నెటిజెన్ చిరాకు తెప్పించాడు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేశాలకు ప్రొక్లైయిన్తో అంత్యక్రియలు చేయించటంపై రియాక్ట్ అయిన సదరు నెటిజెన్.. `సందీప్ కిషన్, కోన వెంకట్లు ఇప్పుడు ఎలా దాక్కున్నారు` అంటూ ట్వీట్ చేశాడు.
ఇటీవల కాలం సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలకు ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. సామాజిక అంశాల విషయంలో సెలబ్రిటీలను స్పందించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి చేస్తున్నారు నెటిజెన్లు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే ఓ యంగ్ హీరోకు ఎదురైంది. తెలుగుతో పాటు కోలీవుడ్లోనూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటాడు.
కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన సందీప్ కిషన్కు ఓ నెటిజెన్ చిరాకు తెప్పించాడు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేశాలకు ప్రొక్లైయిన్తో అంత్యక్రియలు చేయించటంపై రియాక్ట్ అయిన సదరు నెటిజెన్.. `సందీప్ కిషన్, కోన వెంకట్లు ఇప్పుడు ఎలా దాక్కున్నారు` అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్పై సందీప్ కిషన్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.
`నేను మంచి మాత్రమే స్పెడ్ చేయాలనుకుంటున్నా.. మంచి ఎక్కడ చేసినా నేను అప్రిసియేట్ చేస్తాను. ఈ టైంలో ఇంకా అవసరం. నాకు పొలిటికల్ నాలెడ్జ్ జీరో. నేను ఆ నాలెడ్జ్ పెంచుకోవాలని కూడా అనుకోవటం లేదు. ఆ మంచి నువ్వు చేసి నా కంట పడ్డా.. ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసే ఫస్ట్ పర్సన్ నేనే` అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు ఈ కామెంట్తో పాటు నా హ్యాండిల్ నా ఇష్టం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు సందీప్.