Asianet News TeluguAsianet News Telugu

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ క్రేజీ ప్రాజెక్ట్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

టాలీవుడ్ హీరో సుమంత్ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అరిస్తున్నాడు. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్న సుమంత్ తాజాగా మరో సినిమాను ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

Hero Sumanths crazy project directed by Santhosh Jagarlapudi, Interesting details
Author
Hyderabad, First Published Jul 3, 2022, 6:39 PM IST

టాలీవుడ్ హీరో సుమంత్ (Sumanth) క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతూ జోరు పెంచుతున్నాడు. ఇప్పటికే ఏడాది ఓటీటీలో రిలీజ్ అయిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్  చిత్రం ‘మళ్లీ మొదలైంది’తో ఫామ్ లోకి వచ్చాడు సుమంత్. ఈ చిత్రానికి ఓటీటీలో ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. సుమంత్ అభిమానులు ఈ చిత్రంతో ఫుల్ ఫిదా అయ్యారు. తమ అభిమాన హీరో ఎంచుకుంటున్న కథలపై కాస్తా ఆశలు పెంచుకుంటున్నారు.  Malli Modalaindi మూవీని  టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మాత కే రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ప్రధాన పాత్రలో సుమంత్ నటించగా, హీరోయిన్ గా నైనా గంగూలీ (Naina Ganguly) నటించారు. 

ఈ చిత్రం ఇచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో సుమంత్ తన నెక్ట్ మూవీ చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గతంలోనే తన తదుపరి చిత్రం ‘అహాం రీబూట్’ (Aham Reboot)గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సుమంత్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. కచ్చితంగా హిట్ కొట్టాలనే దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో సుమంత్ మరో చిత్రాన్ని కూడా ప్రకటించారు. 

తన తదుపరి చిత్రంగా సుమంత్ (Sumanth) క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. హీరోగా సుమంత్ నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం - ప్రశాంత్ సాగర్ అట్లూరి వహిస్తున్నారు. అద్భుతమైన  సంగీతాన్ని  శ్రీరామ్ మద్దూరి అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను వరుణ్ అంకర్ల చూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను 
సూపర్ విజన్ - సుమ కార్తికేయ పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైన్ గా ఏఆర్ వంశీ, సౌండ్ ఇంజనీర్ గా నాగార్జున తాళ్లపల్లి, పీఆర్వో బాధ్యతలను జీఎస్కే మీడియా చూస్తోంది. నిర్మాతలుగా రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు వ్యవహరిస్తున్నారు. 

‘సుబ్రహ్మణ్యపురం’, ‘లక్ష్య’ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి సుమంత్ తదుపరి చిత్రానికి దర్శకతవం వహించబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన "సుబ్రహ్మణ్యపురం" సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం ప్రకటించారు.

పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్ కు  గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కే ప్రదీప్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios