ప్రణయ్ హత్యపై హీరో రామ్ కామెంట్!
ప్రణయ్, అమృతలు కులాంతర వివాహం చేసుకున్నప్పటి నుండి రగిలిపోతున్న అమృత తండ్రి.. ప్రణయ్ ని హత్య చేయించిన సంఘటన తెలిసిందే. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతుండడంపై సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రణయ్, అమృతలు కులాంతర వివాహం చేసుకున్నప్పటి నుండి రగిలిపోతున్న అమృత తండ్రి.. ప్రణయ్ ని హత్య చేయించిన సంఘటన తెలిసిందే. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతుండడంపై సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సింగర్ చిన్మయి, మంచు మనోజ్ ఈ విషయంపై స్పందించగా తాజాగా హీరో రామ్ కూడా మాట్లాడారు. ట్విట్టర్ వేదికగా ప్రణయ్ ని హత్యపై స్పందిస్తూ.. ''ఓ పక్క సెక్షన్ 377 ని తీసేస్తే.. ఇంకా ఈ కులాలు, పరువు హత్యలు ఏందిరా జంగిల్ ఫెలోస్. ముందు మనుషులుగా ఎలా బతకాలో తెలుసుకోండి'' అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం రామ్ 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
O pakka #Section377 ne etheste inka e Caste-lu..Honor Killing-lu endhi ra Jungle Fellows! #PranayAmrutha 💔 ...for God sake, learn to be a #HUMANFIRST !!!! - R.A.P.O
— RAm POthineni (@ramsayz) September 17, 2018
ఇది కూడా చదవండి..
ప్రణయ్ హత్యపై మంచు మనోజ్ లెటర్!