సర్జికల్ స్ట్రైక్స్ పై రామ్ చరణ్ కామెంట్!
కొద్దిరోజుల క్రితం పుల్వామాలో నలభై మందికి పైగా జవాన్లు ఉగ్రదాడి కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ దాడిపై భారత సైన్యంతో పాటు ప్రతిఒక్క భారతీయుడు రగిలిపోయాడు.
కొద్దిరోజుల క్రితం పుల్వామాలో నలభై మందికి పైగా జవాన్లు ఉగ్రదాడి కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ దాడిపై భారత సైన్యంతో పాటు ప్రతిఒక్క భారతీయుడు రగిలిపోయాడు.
ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది.
తెల్లవారు జామున 3 గంటలకు జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై స్పందించిన సినీ నటుడు రామ్ చరణ్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని 'జై హింద్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
దానికి ఇండియాస్ట్రైక్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించాడు.