ఓటు మన బాధ్యత, మన పవర్, మన హక్కు.. ఇప్పటికైనా రియలైజ్ కావాలిః `ఇస్మార్ట్ శంకర్` రామ్
`ఇస్మార్ట్ శంకర్` ఫేమ్ హీరో రామ్ పోతినేని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షేక్ పేటలోని ఎమ్మార్వో ఆఫీస్లో తమ ఓటుని వేశారు. మాస్క్ ధరించి, కరోనా నియమాలను పాటిస్తూ ఓటుని వేశారు.
తారలు తరలి వస్తున్నారు. మొదట్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నెమ్మదిగా వచ్చిన సెలబ్రిటీలు ఇప్పుడు కాస్త జోరు పెంచారు. వరుసగా యంగ్ హీరోలు ఓటు హక్కుని వినిపించుకునేందుకు ముందుకు వస్తున్నారు. తమ సామాజిక బాధ్యతని, ఓటు విలువని చాటుతున్నారు.
`ఇస్మార్ట్ శంకర్` ఫేమ్ హీరో రామ్ పోతినేని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షేక్ పేటలోని ఎమ్మార్వో ఆఫీస్లో తమ ఓటుని వేశారు. మాస్క్ ధరించి, కరోనా నియమాలను పాటిస్తూ ఓటుని వేశారు. ఓ పోలీస్ రామ్కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా కాదని, నమస్కారం పెట్టడం విశేషం. కరోనా వెళ్లలేదు ఇంకా ఉందన్నారు.
ఈ సందర్భంగా రామ్ మీడియా ముందు మాట్లాడుతూ, `ఓటు వేయడం మన బాధ్యత, మన హక్కు, మన పవర్. ఓటు వేయాలని చెబితే జరిగేది కాదు, రియలైజ్ అయి రావాలి. తమ బాధ్యతని చాటుకోవాలి` అని చెప్పారు.