`ఇస్మార్ట్ శంకర్` ఫేమ్ హీరో రామ్ పోతినేని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షేక్ పేటలోని ఎమ్మార్వో ఆఫీస్లో తమ ఓటుని వేశారు. మాస్క్ ధరించి, కరోనా నియమాలను పాటిస్తూ ఓటుని వేశారు.
తారలు తరలి వస్తున్నారు. మొదట్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నెమ్మదిగా వచ్చిన సెలబ్రిటీలు ఇప్పుడు కాస్త జోరు పెంచారు. వరుసగా యంగ్ హీరోలు ఓటు హక్కుని వినిపించుకునేందుకు ముందుకు వస్తున్నారు. తమ సామాజిక బాధ్యతని, ఓటు విలువని చాటుతున్నారు.
`ఇస్మార్ట్ శంకర్` ఫేమ్ హీరో రామ్ పోతినేని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షేక్ పేటలోని ఎమ్మార్వో ఆఫీస్లో తమ ఓటుని వేశారు. మాస్క్ ధరించి, కరోనా నియమాలను పాటిస్తూ ఓటుని వేశారు. ఓ పోలీస్ రామ్కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా కాదని, నమస్కారం పెట్టడం విశేషం. కరోనా వెళ్లలేదు ఇంకా ఉందన్నారు.
ఈ సందర్భంగా రామ్ మీడియా ముందు మాట్లాడుతూ, `ఓటు వేయడం మన బాధ్యత, మన హక్కు, మన పవర్. ఓటు వేయాలని చెబితే జరిగేది కాదు, రియలైజ్ అయి రావాలి. తమ బాధ్యతని చాటుకోవాలి` అని చెప్పారు.
షేక్ పేట్ ఎమ్మార్వో ఆఫీస్లో ఓటు హక్కుని వినియోగించుకున్న `ఇస్మార్ శంకర్` రామ్#Rampothineni @ramsayz #HyderabadCivicPolls #GHMCElections2020 pic.twitter.com/YI6kpoisnR
— Asianetnews Telugu (@AsianetNewsTL) December 1, 2020
ఓటు మన బాధ్యత, మన పవర్, మన హక్కు.. ఇప్పటికైనా రియలైజ్ కావాలిః రామ్ పోతినేని#rampothineni #GHMCElections2020 @ramsayz pic.twitter.com/dAJMgcQNJw
— Asianetnews Telugu (@AsianetNewsTL) December 1, 2020
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 1, 2020, 2:04 PM IST