ధనుష్ చెన్నైలో ఓ ఖరీదైన ఇంటి నిర్మాణం చేపట్టారట. ఆ లగ్జరీ హౌస్ విలువ దాదాపు రూ. 300 కోట్లని సమాచారం. అంత పెద్ద మొత్తం ఇంటి నిర్మాణానికి కేటాయించడమంటే మామూలు విషయం కాదు.
గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్న ధనుష్ (Dhanush) దేశవ్యాప్తంగా మార్కెట్ కలిగి ఉన్నాడు. బాలీవుడ్ లో కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన లేటెస్ట్ రిలీజ్ అత్రాంగి రే హిందీలో మంచి విజయం సాధించింది. అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ కో స్టార్స్ గా అత్రాంగి రే చిత్రంలో నటించారు. ఇక తెలుగులో రెండు చిత్రాలు ఓకే చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ టైటిల్ తో బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సార్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరొక బైలింగ్వల్ మూవీ ప్రకటించారు ధనుష్. వీటితో పాటు రెండు తమిళ్, ఓ ఇంగ్లీష్ మూవీ చేస్తున్నారు. నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న ధనుష్ సినిమాకు రూ. 40 కోట్లకు పైనే ఛార్జ్ చేస్తున్నారట. కాగా ధనుష్ చెన్నైలో ఓ ఖరీదైన ఇంటి నిర్మాణం చేపట్టారట. ఆ లగ్జరీ హౌస్ విలువ దాదాపు రూ. 300 కోట్లని సమాచారం. అంత పెద్ద మొత్తం ఇంటి నిర్మాణానికి కేటాయించడమంటే మామూలు విషయం కాదు. కోలీవుడ్ మీడియాలో ఈ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇదే నిజమైతే సౌత్ ఇండియాలోనే ఖరీదైన ఇల్లు కలిగిన హీరోగా ధనుష్ రికార్డులకు ఎక్కడం ఖాయం.
మరోవైపు ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ (Aiswarya Rajinikanth)తో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. విడాకులు ప్రకటించి నెలలు గడుస్తున్నా కుటుంబ సభ్యులు వీరిని కలపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విడాకుల ప్రకటన తర్వాత కూడా వీరిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలలో కనిపించారు. ధనుష్-ఐశ్వర్యలకు ఇద్దరు అబ్బాయిలు.
ఇక ధనుష్ ప్రవర్తన కారణం గానే ఐశ్వర్య అతనితో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధనుష్ అఫైర్స్ గురించి చాలా కాలంగా అసహనంగా ఉన్న విడిగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు మీడియా కథనాల సారాంశం. కాగా సోషల్ మీడియాలో పరోక్షంగా ధనుష్ ని ఉద్దేశిస్తూ ఐశ్వర్య చేసే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.