కంగనా వివాదం.. ప్రభాస్కి తలనొప్పిగా మారిందా?
నేషనల్ స్టార్గా దూసుకుపోతున్న ప్రభాస్కి కంగనా రనౌత్ రూపంలో కొత్త తలనొప్పి నెలకొంది. ఈ వివాదం తన సినిమాలపై ప్రభావం పడనుంది.
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన పేరుతో వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక్కో సినిమాకి మూడు వందల నుంచి నాలుగు వందల బడ్జెట్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు బడ్జెట్ వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం ఆయన పేరుతో దాదాపు పదిహేను వందల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నేషనల్ స్టార్గా దూసుకుపోతున్న ప్రభాస్కి కంగనా రనౌత్ రూపంలో కొత్త తలనొప్పి నెలకొంది. ఈ వివాదం తన సినిమాలపై ప్రభావం పడనుంది. ప్రభాస్, కంగనా కలిసి `ఏక్ నిరంజన్` చిత్రంలో నటించారు. ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. అయితే ఇప్పుడు కంగనా వ్యవహారం బాలీవుడ్లో పెద్ద దుమారం రేపుతుంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విషయంలో, డ్రగ్స్ కేసు విషయంలో కంగనా అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీంతో శివసేన ప్రభుత్వానికి, కంగనాకి మధ్య ముంబయిలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే కంగనాకి సంబంధించిన వార్తలు రాసే క్రమంలో, మరోవైపు యూట్యూబ్ ఛానెల్స్ లో ప్రభాస్ హీరోయిన్ అంటూ ప్రసారం చేస్తున్నారు. ఇదిప్పుడు ప్రభాస్కి పెద్ద తలనొప్పిగా మారింది.
ఓ వైపు జాతీయ సినిమాలు చేస్తూ, మరింత హైప్ పెంచుకునే టైమ్లో ఇలా వివాదాల్లో తన పేరుని వాడటం మార్కెట్ పరంగా అది దెబ్బ పడే ఛాన్స్ ఉందని క్రిటిక్స్ భావిస్తున్నారు. మరి దీనిపై ప్రభాస్ అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధే శ్యామ్` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం, అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో `ఆదిపురుష్` చిత్రాల్లో నటించేందుకు కమిట్ అయిన విషయం తెలిసిందే.