పవన్ `pspk28` వార్తలు నమ్మవద్దు.. రూమర్స్ పై స్పందించి హరీష్ శంకర్ టీమ్
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ మేడ్ ఫోటోగో, దీనికి టైటిల్ కూడా కన్ఫమ్ అయ్యిందనే వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. `గబ్బర్ సింగ్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో pspk28 వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కనుంది. దీన్ని గతేడాదినే ప్రకటించారు. ఈ మేరకు సినిమాకి సంబంధించిన థీమ్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా తెరకెక్కనుంది. థీమ్ పోస్టర్లో ఇండియా గేట్, బుల్లెట్ బైక్ని, పెద్ద బాలశిక్ష బుక్ని చూపించారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లెట్పై పవన్ కళ్యాణ్ కూర్చొని ఉన్న ఫోటో ఇది. ఫ్యాన్స్ మేడ్ ఫోటోగో, దీనికి టైటిల్ కూడా కన్ఫమ్ అయ్యిందనే వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. సినిమాకి సంబంధించిన తమ నుంచి ఎలా అప్డేట్ ఇవ్వలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది యూనిట్.
మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ, `ఈ ఉగాదికి చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయాలని భావించాం. కానీ కరోనా మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. మేం ఏదైనా అఫీషియల్గానే ప్రకటిస్తాం. రైట్ టైమ్లో ఆ విషయాలు తెలియజేస్తాం` అని తెలిపింది. హరీష్ శంకర్ సైతం స్పందిస్తూ గాలివార్తలను స్ప్రెడ్ చేయవద్దని, నమ్మవద్దని తెలిపారు. మోర్ ఎగ్జైటెడ్ త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం` అని తెలిపారు.
ప్రస్తుతం పవన్.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్ర రీమేక్లో నటిస్తున్నారు. రానా మరో హీరో. ఇందులో నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తారని సమాచారం. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు పవన్. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కనుంది.