తేజ సజ్జా పేరిట అరుదైన రికార్డు... బాక్సాఫీస్ షేక్ చేసిన హనుమాన్!
హనుమాన్ మూవీ వసూళ్లు మరో మైలురాయికి చేరాయి. ఏకంగా మూడు వందల కోట్ల మార్క్ దాటేసింది తేజ సజ్జా చిత్రం. దర్శకుడు ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా దర్శకుల లిస్ట్ లో చేరారు.
![hanuman rare feat at box-office touches three hundred crore mark ksr hanuman rare feat at box-office touches three hundred crore mark ksr](https://static-ai.asianetnews.com/images/01hntgg3ht4ayqgx5v84cct3yk/hanuman--4--jpg_363x203xt.jpg)
చాలా అరుదుగా హనుమాన్ వంటి సంచలన చిత్రాలు విడుదలవుతాయి. సంక్రాంతి బరిలో ఎలాంటి అంచనాలు లేకుండా హనుమాన్ దిగింది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం పోటీగా విడుదలైంది. గుంటూరు కారం ముందు హనుమాన్ నిలబడటం కష్టమే అనుకుంటే... బడా స్టార్స్ కి ఝలక్ ఇస్తూ హనుమాన్ సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హనుమాన్ వసూళ్లు పెరుగుతూ పోయాయి. నాలుగో వారం కూడా నిలకడగా ఉన్నాయి.
బాక్సాఫీస్ వద్ద 25 రోజుల రన్ పూర్తి చేసుకున్న హనుమాన్ ఏకంగా రూ. 300 కోట్ల మార్క్ టచ్ చేసింది. బడా హీరోలకు కూడా సాధ్యం కానీ ఈ ఫీట్ తేజా సజ్జా వంటి యంగ్ హీరో సాధించడం గొప్ప పరిణామం. కంటెంట్ ముఖ్యం స్టార్ క్యాస్ట్ కాదని హనుమాన్ నిరూపించింది. విడుదలైన అన్ని భాషల్లో హనుమాన్ చిత్రానికి రెస్పాన్స్ దక్కింది.
హనుమాన్ విజయంలో అధికభాగం దర్శకుడు ప్రశాంత్ వర్మకు దక్కుతుంది. ఒక్క చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రశాంత్ వర్మ ఆకర్షించాడు. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ తో రూ. 500 కోట్ల రేంజ్ విజువల్స్ ఇచ్చాడు. హనుమాన్ లో ప్రేక్షకులను ఆకర్షించిన ప్రధాన విషయం విజువల్స్. అత్యధిక లాభాలు పంచిన టాలీవుడ్ చిత్రాల జాబితాలో హనుమాన్ చేరింది.
ఇక హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ తో టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ 2025లో విడుదల కానుందట. జై హనుమాన్ లో ఒక స్టార్ హీరో నటిస్తాడని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. తేజ సజ్జా సైతం ఒక పాత్రలో కనిపిస్తాడట. భారతీయ ఇతిహాసాల ఆధారంగా సూపర్ హీరో మూవీస్ తీస్తానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
హనుమాన్ మూవీలో తేజా సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ హీరో అక్క పాత్రలో కీలక రోల్ చేసింది. వినయ్ రాయ్ ప్రధాన విలన్ పాత్రలో మెప్పించాడు. హనుమాన్ మరో వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉంది.