#Gunturkaaram హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంతకు అమ్మారంటే...
గతంలో మహర్షి, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవ్వరూ చిత్రాలు 16, నుంచి 21 కోట్లు దాకా పలికాయి. ఇప్పుడు ఈ గుంటూరు కారం చిత్రానికి సైతం...
![Guntur Kaaram Hindi Rights Sold For A Whopping Price? jsp Guntur Kaaram Hindi Rights Sold For A Whopping Price? jsp](https://static-ai.asianetnews.com/images/01hjxaryrewgjbw6g3y4654z21/guntur-kaaram--1--jpg_363x203xt.jpg)
ఎక్కడ చూసినా మహేశ్బాబు (Mahesh babu) నటించిన కొత్త చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)క,బుర్లే. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో క్రేజీగా జరిగిందని సమాచారం. ఈ చిత్రం పై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక ఈ చిత్రం తెలుగు రాష్టాల్లో కాకుండా ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ అవుతుందా అనేది చాలా మందికి వస్తున్న సందేహం. ఇప్పుడు అన్ని సినిమాలు దేశ వ్యాప్తంగా ఒకే సారి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇది లోకల్ కంటెంట్ అని మహేష్ చాలా క్లారిటీగా ఉన్నారని తెలుస్తోంది. దాంతో సినిమా తెలుగు వెర్షన్ మాత్రమే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
తెలుగులో రిలీజ్ అయ్యిన మూడు నెలల తర్వాత నార్త్ బెల్ట్ లో రిలీజ్ కానుంది. దాంతో హిందీ వెర్షన్ ఎంతకు అమ్మారనే విషయం ఆరాతీస్తే..తెలిసిన విషయం ... ఇరవై ఐదు కోట్లకు ఇచ్చారని తెలుస్తోంది. హిందీలోనూ నీట్ గా డబ్ చేసి వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మహర్షి, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవ్వరూ చిత్రాలు 16, నుంచి 21 కోట్లు దాకా పలికాయి. ఇప్పుడు త్రివిక్రమ్ తో క్రేజీ కాంబో కావటంతో 25 దాకా వెళ్లిందని చెప్తున్నారు.
తాజాగా మహేశ్ అభిమానులతో సోషల్మీడియా వేదికగా మాట్లాడుతూ... ‘‘చాలా కాలం నుంచి మహేశ్తో సినిమా చేయాలనుకుంటున్నా. ‘గుంటూరుకారం’తో అది నెరవేరింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్ మ్యూజిక్ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్ రీరికార్డింగ్ పూర్తైంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ ఇది. ఫస్టాఫ్లో వచ్చే ఫైట్లో ఇద్దరు సూపర్స్టార్స్ను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం. థియేటర్ల జాబితా ఇంకా ఫైనల్ కాలేదు’’ అని ఆయన చెప్పారు.
అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు.
గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. మహేశ్ - త్రివిక్రమ్ స్టైల్ మాస్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.