Asianet News TeluguAsianet News Telugu

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సెన్సార్ పూర్తి.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

గోపీచంద్ - రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేశారు. రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.
 

Gopichandh Pakka Commercial Censors Complete, Interesting Details!
Author
Hyderabad, First Published Jun 28, 2022, 3:20 PM IST

గోపీచంద్‌(Gopichand) ఇటీవల `సీటీమార్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ `పక్కా కమర్షియల్‌`(pakka Commercial)లో నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna), పలు కీలక పాత్రల్లో స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు నటించారు. జూలై 1న రిలీజ్ కానున్న ఈ మూవీని అల్లు అరవింద్  స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కుతుంది. 

చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్  సిటీలో గల శిల్పా కళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ పక్కా కమర్షియల్ మెగా మ్యాచో ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా హాజరై చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. మరింత  రీచ్ పెరిగేలా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది యూనిట్.

తాజాగా పక్కా కమర్షియల్ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.  ఈ చిత్రం 2 గంటల 32 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించడానికి అన్ని విధాలా సిద్ధమైంది. ఇప్పటికే చిత్రంలోని పాటలు, ట్రైలర్ ఆడియెన్స్ కు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. మరోవైపు టైటిల్ కు కూడా ఇండస్ట్రీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios