అల్లు అర్జున్తో `గోనగన్నారెడ్డి` సినిమా.. దర్శకుడు గుణశేఖర్ ఏం చెప్పారంటే?
`రుద్రమదేవి` చిత్రంలో అల్లు అర్జున్ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర ఎంతగా హైలైట్ అయ్యిందో తెలిసిందే. ఈ పాత్ర ప్రధానంగా బన్నీతో `గోనగన్నారెడ్డి` చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ జరిగినట్టు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై దర్శకుడు గుణ శేఖర్ స్పందించారు.
దర్శకుడు గుణ శేఖర్ ఇప్పుడు మైథలాజికల్ మూవీ `శాకుంతలం`తో రాబోతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అయితే గుణశేఖర్ అంతకు ముందు `రుద్రమదేవి` చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వీఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. దీంతో సోసోగానే ఆడింది. అంచనాలను అందుకోలేకపోయింది.
ఇందులో అల్లు అర్జున్ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర హైలైట్గా నిలిచింది. రుద్రమదేవి ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునే ఈ పాత్ర ఆకట్టుకుంది. రుద్రమదేవికి నెగటివ్గా కనిపిస్తూనే చివరికి అండగా నిలిచే పాత్రగా క్లైమాక్స్ లో వాహ్ అనిపించింది. మరోవైపు గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ ఇరగదీశాడు. ఆయన కనిపించినప్పుడల్లా సినిమాకి హై వస్తుంది. ఆ పాత్రలో రెచ్చిపోయి చేశాడు బన్నీ. అందుకే సినిమా మొత్తంలో ఆయన పాత్రనే హైలైట్గా నిలుస్తుంది.
అయితే `రుద్రమదేవి` సినిమా విడుదల సమయంలో బన్నీ ఫ్యాన్స్ నుంచి `గోనగన్నారెడ్డి` సినిమా చేయాలనే డిమాండ్ వచ్చింది. దర్శకుడు గుణశేఖర్కి ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ లు వచ్చాయి. దీంతో దర్శకుడు `గోనగన్నా రెడ్డి` పాత్ర ప్రధానంగా ఆయన స్టోరీ నేపథ్యంలో సెపరేట్ సినిమా కూడా తీయాలనుకుంటున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు గుణశేఖర్ స్పందించారు. `శాకుంతలం` ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాపై ఆయన రియాక్ట్ అయ్యారు. క్లారిటీ ఇచ్చారు. అసలు తాను `గోనగన్నారెడ్డి` సినిమా చేయాలని అనుకోలేదని, అది కేవలం వదంతు మాత్రమే అని స్పష్టం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్తో `గోనగన్నారెడ్డి` సినిమా చేయాలనేది ఆయన ఫ్యాన్స్ డిమాండ్ మాత్రమే అన్నారు. కానీ `రుద్రమదేవి` సినిమాలోనే బన్నీ, తాను కూర్చొని ఆ పాత్రని ఎంతగా వాడుకోవాలో వాడేశామని, ఉన్నదానికంటే కాస్త ఎక్కువే చూపించామని, ఆ పాత్రకి సంబంధించి ఇంకా చెప్పడానికి ఏం లేదన్నారు.
డిమాండ్ మేరకు సినిమా తీయాలని.. చరిత్రని వక్రీకరించి కథ పెంచి చేయకూడదు. ప్రాపర్ ఉన్న చరిత్రని తీసుకుని చేయాలి తప్పితే, కల్పితంతో చేయకూడదని వెల్లడించారు. అయితే `రుద్రమదేవి`లో బన్నీ పాత్ర క్లిక్ అయ్యిందని, ఆయనతో ఇలాంటి ఓ పాత్రతో సినిమా చేయాలనే ఆలోచన తనకు లేదన్నారు. కానీ ఆసమయంలో ఇన్స్పైర్ అయిన కథలో `హిరణ్య కశ్యప` ఉందన్నారు. ఆ ప్రాజెక్ట్ పై దాదాపు మూడేళ్లు కూర్చున్నానని, కానీ కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్ పక్కకెళ్లిందని, చిన్న బడ్జెట్లో మోస్తారు సినిమా చేయాలనే ఆలోచన నుంచి `శాకుంతలం` పుట్టిందన్నారు.
ఓ లవ్ స్టోరీతో సినిమా చేయాలనుకున్నప్పుడు పూరణాలన్నీ చదువుతున్నాను. ఆ సమయంలో శాకుంతల, దుష్యంతుల లవ్ స్టోరీ మంచి పాయింట్గా కనిపించిందని, వీరి కథలో మంచి లవ్, శృంగారం, కమర్షియాలిటీ, పోయెటిక్ నేచర్ ఉన్నాయని,పైగా మైథలాజికల్ మూవీ కావడంతో ఇది కొత్తగా ఉంటుందని `శాకుంతలం` స్టోరీని ఎంచుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా సీజీ వర్క్ ఫైనల్ ట్యూనింగ్లో ఉందని, 3డీ వర్క్ జరుగుతుందని, రిలీజ్ డైట్కి అన్నీ రెడీ అవుతాయని తెలిపారు. `రుద్రమదేవి` విషయంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వీఎఫ్ఎక్స్, త్రీడీ విషయంలో రాజీపడకుండా క్వాలిటీగా తెరకెక్కిస్తున్నామని, ఈ విషయంలో దిల్రాజు సపోర్ట్ మరువలేనిదన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది.