'గీతా ఆర్ట్స్' లో మాస్ మహారాజా...డైరక్టర్ ఎవరంటే...?
రవితేజ కూడా GAతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు, ఈ ప్రొడక్షన్ హౌస్ యొక్క సక్సెస్రేటు కారణంగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాడనేది నిజం.
తెలుగులోని నిజమైన మాస్ హీరోలలో రవితేజ ఒకడనేది నిజం. రీసెంట్ గా ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తూ ధమాకా, వాల్టేర్ వీరయ్య చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే అదే ఊపులో వచ్చిన ఆయన గత చిత్రం రావణాసుర డిజాస్టర్గా నిలిచింది. అయితే రవితేజతో సినిమా చేసి హిట్ టాక్ వస్తే మెగ్ హిట్ అవుతుంది. ఈ విషయం అందరికి తెలుసు. అందుకే రవితేజ ఎప్పుడు ఫుల్ బిజాగా ఉంటారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ రవితేజతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతోంది. అల్లు అరవింద్ స్వయంగా రవితేజతో మాట్లాడి సెట్ చేసినట్లు సమాచారం.
ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్ రవితేజతో కలిసి పనిచేయాలని డిసైడ్ అవ్వటం, మాస్ మహారాజా ఓకే చెప్పటం సైన్ చెయ్యటం అంతా జరిగిపోయింది. అయితే రవితేజతో అదిరిపోయే హిట్ ఇచ్చే డైరక్టర్ కావాలి. అప్పుడే స్క్రిప్టు, షూటింగ్ ప్రారంభమవుతుంది. రవితేజతో వర్క్ చేయాలనే ఆసక్తి ఉన్న 2-3 దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. త్రినాధరావు నక్కిన తో కూడా గీతా ఆర్ట్స్ చర్చలు జరిపిందని సమాచారం. ధమాకా కాంబో రిపీట్ అయ్యితే మామూలుగా ఉండదని భావిస్తున్నారు.
డైరక్టర్ మరియు బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత అఫీషియల్ ప్రకటన చేయబడుతుంది. ఇది భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అవుతుంది. రవితేజ కూడా GAతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు, ఈ ప్రొడక్షన్ హౌస్ యొక్క సక్సెస్రేటు కారణంగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాడనేది నిజం.
ప్రస్తుతం రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటు ప్రజలను .. అటు పోలీస్ వారిని నానా తిప్పలు పెట్టిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఆ పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.