నటి పూర్ణకు వేధింపులు.. హెయిర్ స్టైలిస్ట్ అరెస్ట్
హీరోయిన్ పూర్ణను వేధించిన కేసులో మలయాళ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అతడిని విచారించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ధర్మజన్, స్టైలిస్ట్లను ముఠా సభ్యులు సంప్రదించినట్టుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
నటి పూర్ణకు వేధింపుల కేసులో ఒక హెయిర్ స్టైలిస్ట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్ణను బెదిరించిన వారికి మలయాళ నటుడు ధర్మజన్ బోల్గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్ కమీషనర్ విజయ్ సఖారే ఈ వివరాలను వెల్లడించారు. అంతేకాదు పూర్ణను వేదించిన ముఠా మరో 8 మంది మోడల్స్ను కిడ్నాప్ చేసి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించిందని పోలీసులు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఆ ముఠాకు సంబంధించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అతడిని విచారించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ధర్మజన్, స్టైలిస్ట్లను ముఠా సభ్యులు సంప్రదించినట్టుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమాలో నటించిన హీరోయిన్ పూర్ణకు సోషల్ మీడియా వేదింపులు ఎదురయ్యాయి. నలుగురు వ్యక్తులు సోషల్ మీడియాలో తనను వేదిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్ డౌన్ కారణంగా మూడు నెలలుగా ఆమె స్వస్థలం కేరళలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే పలు మలయాళ సినిమాలకు అంగీకరించిన ఆమె పెళ్లి ఏర్పాట్లలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ నేపథ్యంలో ఆమెకు ఓ నలుగురు వ్యక్తుల నుంచి ఇటీవల వేదింపులు ఎదురవుతున్నట్టుగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు రాంగ్ కాల్స్తో పాటు డబ్బు ఇవ్వాలని ఆ వ్యక్తులు వేదిస్తున్నట్టుగా ఆమె పోలీసులకు తెలిపింది. కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా పేజ్లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్ట్ లు పెడుతున్నారంటూ ఆమె పోలీసులకు తెలిపింది.