ఢీ (Dhee) బ్యూటీ పూర్ణ (Poorna) పదేండ్ల తర్వాత మరోసారి రవిబాబుతో కలిసి నటించనుంది. ఈ మేరకు తాజాగా రవిబాబు, పూర్ణ కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అగైన్ రవిబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపింది.   

మలయాళ బ్యూటీ షమ్నా కాసిం (Shamna Kasim) సౌత్ ఫిల్మ్ లో  మెరుస్తూ లో హవా కొనసాగిస్తోంది.  తెలుగు ప్రేక్షకులకు పూర్ణగా చేరువైంది. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా పూర్ణకు కొంతమేర గుర్తింపును తెచ్చి పెట్టాయి.  2007లో రిలీజ్ అయిన ‘శ్రీ మహాలక్ష్మి’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లరి నరేష్ ( Allari Naresh) నటించిన  ‘సీమ తుపాకీ’తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘అవును, లడ్డు బాబు, నువ్వలా నేనిలా, అవును 2, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు, జయమ్ము నిశ్చయము రా.., అవంతిక, రాక్షసి’ వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల ‘దృశ్యం 2, అఖండ’ సినిమాల్లో నటించి సౌత్ లో మరింత పాపులారిటీని పెంచుకుంటోంది. 

 

View post on Instagram
 

మరోవైపు ‘ఢీ’ రియాలిటీ షోలోనూ జడ్జీగా కొనసాగుతూ టీవీ ప్రేక్షకులకు కూడా మరింత చేరువైంది. ఢీ షో ద్వారా పూర్ణకు ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలు వస్తున్నారు. మరోవైపు తమిళం, మలయాళం మూవీల్లోనూ నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. అయితే తాజాగా తన నెక్ట్ ఫిల్మ్  గురించి తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. యాక్టర్, డైరెక్టర్ రవిబాబుతో కలిసి మరోసారి నటించబోతోంది. అప్ కమింగ్ ఫిల్మ్ మూవీ నుంచి వీరిద్దరి ఫొటోను అభిమానులతో పంచుకుంది. ‘పదేండ్ల పాటు విజయవంతమైన సహకారం మరియు జీవితంలో నా మరపురాని సినిమాల్లో ‘అవును’ ఒకటి. ఈ చిత్రం తర్వాత మేము మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాం. గతంలో పనిచేసిన టీంతోనే తిరిగి వస్తుండటం ఆనందంగా ఉంది. అయితే ఈసారి మరింత పెద్ద ఎత్తున, మెరుగ్గా వస్తున్నాం. మరోసారి నాపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు రవిబాబు సార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అంటూ పేర్కొంది.  

 

View post on Instagram
 

‘అవును’ రెండు పార్ట్స్ తర్వాత రవిబాబు, పూర్ణ కలిసి నటిస్తున్న చిత్రం ‘అసలు’ ఈ మూవీని మరోసారి రవిబాబు (Ravi Babu) డైరెక్ట్ చేయనున్నారు. రవిబాబు, పూర్ణ  పదేండ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తుండటం పట్ల పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన హరర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘అవును’తో అలరించిన చిత్రం మూనిట్ మరోసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త సబ్జెక్ట్ తో రానుంది.  ఈ మేరకు రవి బాబు కూడా సోషల్ మీడియాలో ‘అసలు’ మూవీతో రానున్నట్టు వెల్లడించారు.