అడివి శేష్ థ్రిల్లర్ 'ఎవరు' ఫస్ట్ లుక్!
'క్షణం', 'అమీ తుమీ', 'గూఢచారి' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయకుడుగా రూపొందుతోన్న థ్రిల్లర్ 'ఎవరు'.
'క్షణం', 'అమీ తుమీ', 'గూఢచారి' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయకుడుగా రూపొందుతోన్న థ్రిల్లర్ 'ఎవరు'. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యానర్పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. వెంకట్ రామ్జీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో రెజీనా కసండ్ర హీరోయిన్గా నటిస్తుంది.
నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రంలో అడివిశేష్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. `క్షణం` వంటి సూపర్హిట్ తర్వాత అడివిశేష్, పివిపి సినిమా కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 23న విడుదల చేస్తున్నారు.