Asianet News TeluguAsianet News Telugu

అడివి శేష్ థ్రిల్లర్ 'ఎవరు' ఫస్ట్ లుక్!

'క్ష‌ణం', 'అమీ తుమీ', 'గూఢ‌చారి' వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ 'ఎవ‌రు'. 

First Look of Adivi Sesh's Evaru: Mysterious and intriguing
Author
Hyderabad, First Published Jul 11, 2019, 4:55 PM IST

'క్ష‌ణం', 'అమీ తుమీ', 'గూఢ‌చారి' వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ 'ఎవ‌రు'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది.

న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను గురువారం విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో అడివిశేష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. `క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత అడివిశేష్‌, పివిపి సినిమా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 23న విడుద‌ల చేస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios