రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం
ప్రస్తుతం రకుల్ ప్రీత్సింగ్ సినిమా షూటింగ్ కోసం లక్నోలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు.
నటి రకుల్ ప్రీత్ సింగ్ ముంబై నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆమె నివసించే భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్సింగ్ సినిమా షూటింగ్ కోసం లక్నోలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ రహస్యాన్ని బయటపెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కే అవకాశాలున్నాయి. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తన అనుబంధాన్ని రకుల్ వెల్లడించింది. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.
దీనిపై రకుల్ ప్రీత్ స్పందిస్తూ.... ఈ ఏడాది తనకు అతి పెద్ద కానుక భగ్నానీ అని సంతోషంగా వెల్లడించింది. భగ్నానీతో తన జీవితం రంగులమయం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. భగ్నానీ స్పందిస్తూ... నువ్వు లేకుండా నా జీవితంలో నో ఫన్ అంటూ రకుల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తనే నా ఆత్మ, నా ప్రపంచం... ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న రకుల్.. తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్, టాలీవుడ్తో పాటు కోలీవుడ్ సినిమాల్లోనూ రకుల్ సినిమాలు చేస్తోంది. ఇటీవల కొండపొలం సినిమాలో నటించి అందరిని ఆకట్టుకుంది.