ధనుష్ కు దిమ్మ తిరిగింది...సాయి పల్లవా మజాకా?
ప్రముఖ దర్సకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ దర్సకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో ‘వచ్చిండే.. మెల్లామెల్లగా వచ్చిండే..’ అంటూ సింగర్ మధుప్రియ గానానికి సాయిపల్లవి, తన డాన్స్ తో అందరినీ ఫిదా చేసింది. ఈ పాట ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ రికార్డును సొంతం చేసుకుంది. అలాగే ఈ పాట ..ఏడు సంవత్సరాల ధనుష్ కొలావరి డి పాట రికార్డ్ ని బ్రద్దలు కొట్టింది.
ఈ వీడియో సాంగ్ యూట్యూబ్లో వేగంగా.. అత్యధిక వ్యూస్ రాబట్టిన లిస్ట్లో రికార్డును క్రియేట్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ చానెల్లో ఈ పాట 173 మిలియన్ల (17.38కోట్లు) వ్యూస్ను రాబట్టి.. తెలుగు పాటకు ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పింది. దీంతో తెలుగువారంతా గర్వపడే సందర్భం ఇదంటూ.. చిత్రయూనిట్పై నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటివరకు 173మిలియన్స్ వ్యూస్ను సాధించింది. సాయి పల్లవి.. తన హావాభావాలు, డ్యాన్సులతో ప్రేక్షకులను కట్టిపడేయడమే ఈ వీడియో సాంగ్స్కు ఇంతటి రెస్పాన్స్ రావడానికి కారణం.
అలాగే ఎవరికైనా సరే ..వచ్చిండే.. అనే పాట వింటే సాయి పల్లవి స్టెప్పులు గుర్తుకురావాల్సిందే. ఫిదా సినిమాలోని ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా ఈ పాటే.. ఏ స్టేజ్పైనా అవే స్టెప్పులతో.... అందరి మనుసుల్లో నాటుకుపోయిందీ పాట. మళ్లీ ఇంకోసారి చూసేయండి ఈ పాటను..