‘ఆదిపురుష్’: విలన్ విషయమై ఫ్యాన్స్ ట్రెండింగ్?
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ వరుస పెట్టి ప్యాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తన 20వ చిత్రం రాధేశ్యామ్ ఇంకా పూర్తి కాక ముందే రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. అందలో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. కాగా.. మరో చిత్రాన్ని మొన్న మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ప్రకటించారు. అది కూడా ప్రభాస్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కావటం విశేషం. దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ ఒక్కరూ తమదైన అభిప్రాయం వెల్లబుచ్చుతున్నారు. ఓ పెద్ద సినిమా ప్రకటన వస్తోందంటే టైటిల్ దగ్గర నుంచి, ఆ సినిమాలో ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయం వరకూ ఫ్యాన్స్ తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. ఒక్కోసారి ఫలానా స్టార్ నటిస్తున్నారంటే వద్దని ట్రెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ తాజా చిత్రానికి అలాంటి మూవ్ మెంటే జరగబోతోందనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే...యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ వరుస పెట్టి ప్యాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తన 20వ చిత్రం రాధేశ్యామ్ ఇంకా పూర్తి కాక ముందే రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. అందలో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. కాగా.. మరో చిత్రాన్ని మొన్న మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ప్రకటించారు. అది కూడా ప్రభాస్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కావటం విశేషం. దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.
ఓంరావుత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఆదిపురుష్’ అనే చిత్రాన్ని తెలుగు, హిందీలో రూపొందిస్తే మలయాళం, కన్నడ, తమిళ భాషలు సహా పలు భాషల్లో అనువదించి విడుదల చేస్తారు. రామాయణంలో రాముడు చెడు(రావణుడు)పై సాధించిన విజయంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ ని ఎదుర్కొనే విలన్ ...కూడా మంచి స్టామినా గలిగిన వాడై ఉండాలి. ఆ స్దాయి ఉన్న విలన్ కోసం దర్శక,నిర్మాతలు సైఫ్ అలీఖాన్ ని సంప్రదిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. సైఫ్ అయితే బాలీవుడ్ లోనూ క్రేజ్ ఉంటుందనేది వారి ఆలోచనగా చెప్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ విలన్ అంటే...ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది కొంత నిరాశపరిచి వార్త అనే చెప్పుకోవాలి. ప్రభాస్ ఫ్యాన్స్...విలన్ గా రానా లేదా హ్రితిక్ వంటి పెద్ద స్టార్ ను ఊహించుకున్నారు. దాంతో వారు సోషల్ మీడియాలో ఈ విషయమై డిస్కషన్స్ పెడుతున్నారు. కొందరైతే ట్విట్టర్ లో ట్రెండ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే సైఫ్ అని ప్రకటించకుండా మీడియాలో వచ్చిన వార్తలను బట్టి మాట్లాడటం ఎంతవరకూ సబబు అని కొందరు ఆపుతున్నారు.
ఇక “ఆది పురుష్” సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి? విషయమై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్… ప్రభాస్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశాడు. అందులోనే… రాముడిగా ప్రభాస్ నటించబోతున్నాడని, ఆ దేవుడి పాత్రలో అతికొద్దిమంది నటులు మాత్రమే రాణించారన్నట్లుగా మెన్షన్ చేశాడు. అలా…. ప్రభాస్ కొత్త సినిమాపై ఉన్న అన్ని డౌట్స్ కి ఎండ్ కార్డు పండటం జరిగింది.