Asianet News TeluguAsianet News Telugu

కాన్సర్‌తో అభిమాని కన్నుమూత.. విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవకొండ ఎమోషనల్‌ అయ్యాడు. అభిమాని హఠాన్మరణంతో ఆయన చలించిపోయాడు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పెట్టాడు విజయ్‌. తన టైమ్‌లైన్‌లో నువ్వు ఎప్పటికీ గుర్తిండిపోతావని పేర్కొన్నాడు. 

fan dead with cancer hero vijay devarakonda emotional tweet  arj
Author
Hyderabad, First Published May 2, 2021, 9:28 AM IST

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవకొండ ఎమోషనల్‌ అయ్యాడు. అభిమాని హఠాన్మరణంతో ఆయన చలించిపోయాడు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పెట్టాడు విజయ్‌. తన టైమ్‌లైన్‌లో నువ్వు ఎప్పటికీ గుర్తిండిపోతావని పేర్కొన్నాడు.  విజయ్‌ దేవరకొండకి `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం` విజయాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఏర్పడింది. విజయ్‌ ని ఆరాధించే అభిమానులు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చిందంటే ఒక్క విజయ్‌ దేవరకొండకే అని చెప్పొచ్చు. 

అయితే హేమంత్‌ అనే తన అభిమాని ఇటీవల కాన్సర్‌తో మంచాన పడ్డాడు. హేమంత్‌ చివరి కోరిక మేరకు అతడితో వీడియో కాల్‌ మాట్లాడారు విజయ్‌. ఆ సమయంలో అతని కోసం తన `రౌడీవేర్‌` నుంచి టీషర్ట్ లు కూడా పంపించాడు. అవి తనకు అందాయి. కానీ ఇంకా వేసుకోలేదు.  తాజాగా అతడు మరణించాడన్న వార్తతో విజయ్‌ చలించిపోయాడు. తన అభిమాని,తాను స్వయంగా మాట్లాడిన అభిమాని తుదిశ్వాస విడవడంతో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు.

ఈ సందర్భంగా విజయ్‌ స్పందిస్తూ, `ఐ మిస్‌యూ హేమంత్‌.. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ మధురమైన చిరునవ్వును చూశాను, నీ ప్రేమను ఫీల్‌ అయ్యాను. అదే ప్రేమను నీకు పంచాను. కళ్లలో నీళ్లు తిరగుతున్నాయి. కన్నీళ్లతో నీకోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. ఇతడిని నాదాకా చేరుకునేలా చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. హేమంత్‌ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను. నీ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంచుకుంటాను` అని ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పంచుకున్నాడు. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది.

విజయ్‌ దేవకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నారు. విజయ్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. పూరీ, చార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కరోనాతో నిలిచిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios