Asianet News TeluguAsianet News Telugu

మెగా మేనల్లుడు షూటింగ్.. దిక్కుమాలిన రూమర్

చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. 

False corona rumour on Krish Movie
Author
Hyderabad, First Published Sep 4, 2020, 11:52 AM IST

‘ఉప్పెన’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ఈ సినిమాకు ఇటీవలే ముహూర్తం జరిపారు. తాజాగా వికారాబాద్‌ అడవుల్లో షూటింగ్‌ ప్రారంభించారు.

ఏకధాటిగా 45 రోజులు షూట్‌ చేసి, ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ మేరకు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ లోగా ఓ వార్త వచ్చి మెగాభిమానులను కంగారుపెట్టింది. అదేమిటంటే..ఈ సినిమా టీమ్ లో ఒకరికి కరోనా వచ్చిందని, దాంతో షూటింగ్ ఆపేసారని ఆ వార్త సారాంశం. అయితే అందుతున్న సమాచారం మేరకు అటువంటిదేమీ జరగలేదు. అది కేవలం కొందరు గిట్టని వాళ్లో,లేక వార్త కోసం కొందరు మీడియా జనం పుట్టించిన రూమరో అని తేలింది. షూటింగ్ టీమ్ లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఏ విధమైన ఇబ్బంది లేకుండా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. 

ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ . ‘‘అడవి నేపథ్యంలో జరిగే కథ ఇది. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయడానికి క్రిష్‌ సన్నాహాలు చేస్తున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.

Follow Us:
Download App:
  • android
  • ios