మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌లాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు పంపింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మోహన్‌లాల్‌కు సమన్లు పంపినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌లాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు పంపింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మోహన్‌లాల్‌కు సమన్లు పంపినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చేవారం కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. పురాతన వస్తువుల వ్యాపారి Monson Mavunkalకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి అధికారులు మోహన్‌లాల్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.

ప్రజలను రూ.10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై కేరళ పోలీసులు మోన్సన్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. కేరళలోని మోన్సన్ నివాసానికి మోహన్‌లాల్ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే మోహన్ లాల్ ఎందుకు వెళ్లారనే దానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. ఈ అంశంలోనే ఈడీ అధికారులు మోహన్ లాల్‌ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, పలువురు సినీ నటులు, ఉన్నతాధికారులతో సహా సమాజంలోని ప్రముఖ వ్యక్తులతో మోన్సన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈడీ, క్రైమ్ బ్రాంచ్ గతంలో గుర్తించాయి.అయితే మోహన్‌లాల్ కలూర్‌లోని మోన్సన్ మావుంకల్ ఇంటికి వెళ్లినట్టుగా ఈడీకి వాంగ్మూలం అందింది. మోన్సన్‌తో సన్నిహిత సంబంధం ఉన్న మరో నటుడు మోహన్‌లాల్‌ను అక్కడికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక, మోన్సన్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఐజీ లక్ష్మణ్‌ను ఆదేశించాలని డిమాండ్ చేస్తూ కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు ఈడీ బుధవారం నోటీసు పంపింది.

ఇక, కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన మవున్‌కల్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ ప్రజలను రూ.10 కోట్ల వరకు మోసం చేశాడు. టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలుగోలు.. వంటి ఇతర వస్తువులను కలిగి ఉన్నాననే అతని మాటలు అబద్ధమని పోలీసులు గుర్తించారు.