‘ఏక్ మినీ కథ’ ఓటీటి రిలీజ్ డేట్
‘పేపర్ బాయ్’ సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుంది.
గత ఏడాది లాగే ఓటీటీల్లో కొత్త చిత్రాలను డైరక్ట్ గా రిలీజ్ చేసే దిశగా నిర్మాతలు అడుగులు వేస్తున్నాయి. ఆ క్రమంలోనే ‘ఏక్ మినీ కథ’ కూడా ఓటీటిలో రాబోతోంది. ‘పేపర్ బాయ్’ సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. కొన్నిసార్లు చిన్న విషయాలే జీవితంలో పెద్ద సమస్యలను ఎలా సృష్టిస్తాయనేది ఈ సినిమాలో ఫన్ గా చర్చించారు.
యువి క్రియేషన్స్ వారి యువి కాన్సెప్ట్స్ అనే బేనర్లో తెరకెక్కిన ఏక్ మిని కథను అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడానికి ఎగ్రిమెంట్ కుదిరినట్లు సమాచారం. ఇంకో పది రోజుల్లోనే ఈ సినిమా ప్రైమ్లోకి వచ్చేయనుందట. మే 27న ఏక్ మిని కథ ప్రిమియర్స్కు డేట్ ఫిక్స్ చేసినట్సు ట్రేడ్ లో వినపడుతోంది.
'వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసారు. కానీ పరిస్దితులు బాగోలేవు. దాంతో ఓటీటి లో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు.
బోల్డ్ అడల్డ్ పాయింట్తో వస్తున్న ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అడల్ట్ టచ్ కామెడీ మూవీ కావడంతో అమెజాన్ కూడా మంచి రేటుకే కొనేందుకు ముందుకు వచ్చిందట. రూ.9 కోట్లకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం.
నిజానికి ఈ సినిమాకు నిర్మాతలు చాలా లో బడ్జెట్ లో ప్లాన్ చేసారట. రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా 9 కోట్లకు బేరం కుదరడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ అడల్ట్ టచ్ కామెడీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలంటోంది ట్రేడ్.